ప్రముఖ టీవీ యాంకర్, నటుడు ప్రదీప్ పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.సునీశిత్ అనే యువ దర్శకుడు ప్రదీప్ పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ప్రస్తుతం హీరోగా ప్రదీప్ ఒక సినిమాలో నటిస్తున్నాడని జైలు శిక్ష అనుభవించిన ప్రదీప్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ నిబంధనలకు విరుద్ధంగా నటించడం ఏమిటని సునీశిత్ అభ్యంతరం వ్యక్తం చేశాడు.
ప్రదీప్ పై పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని సునీశిత్ ఫిర్యాదులో కోరాడు.30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాలో ప్రస్తుతం ప్రదీప్ నటిస్తున్న విషయం తెలిసిందే.అతి త్వరలో ఈ సినిమా విడుదల కాబోతుంది.
ఇలాంటి సమయంలో ప్రదీప్ పై కేసు నమోదు కావడం ప్రదీప్ కు షాక్ అనే చెప్పాలి.దర్శకుడు సునీశిత్ మాట్లాడుతూ యాంకర్ ప్రదీప్ గతంలో ఒక అమ్మాయిని వేధించిన కేసులో జైలు శిక్ష అనుభవించాడని రూల్స్ ప్రకారం ప్రదీప్ ఏ సినిమాలో నటించకూడదని సునీశిత్ చెప్పారు.
ప్రదీప్ పై కేసు నమోదు కావడంతో త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని చెప్పిన చిత్ర యూనిట్ కు షాక్ తగిలింది.ఈ సినిమా షూటింగ్ ను కూడా ఆపేయాలని సునీశిత్ ఫిర్యాదులో పేర్కొన్నాడని తెలుస్తోంది.
న్యాయ సలహా అనంతరం పోలీసులు ఈ కేసులో తదుపరి చర్యలు తీసుకోనున్నారు.ఈ కేసు నుండి ప్రదీప్ ఎలా బయటపడతాడో సునీశిత్ ఫిర్యాదు గురించి ఎలాంటి వివరణ ఇస్తాడో చూడాల్సి ఉంది.
.