సుప్రీం హీరో మెగా మేనల్లుడు అయినటువంటి సాయి ధరమ్ తేజ్ నటించిన ప్రతి రోజు పండగే చిత్రం థియేటర్లలో దూసుకు పోతోంది.ఈ చిత్రం విడుదలయి ఇప్పటికే 13 రోజులు కావస్తున్నా కాసుల విషయంలో మాత్రం ఎక్కడ జోరు తగ్గడం లేదు.
ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు మారుతి దర్శకత్వం వహించగా గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్ నిర్మించారు.ఈ చిత్రంలో ధరమ్ తేజ్ సరసన టాలీవుడ్ గ్లామర్ డాల్ రాశిఖన్నా నటించింది.
అలాగే రావు రమేష్, సత్య రాజ్, హరి తేజ, మురళీ శర్మ వంటివారు ప్రధాన తారాగణంగా నటించారు.
అయితే ఈ చిత్రం కలెక్షన్ల పరంగా టాలీవుడ్ లోనే కొన్ని సినీ రికార్డులను బద్దలు కొట్టే వైపుగా దూసుకుపోతోంది.
అయితే తాజాగా ఈ చిత్రం విడుదలై 13 రోజులు పూర్తి చేసుకుంది.అయితే సినిమా విడుదలైనప్పటి నుంచి 13వ రోజున 2.91 కోట్ల షేర్ వసూలు చేసింది.అయితే ఇందులో ఆశ్చర్య పడాల్సిన విషయం ఏముంది అనుకుంటున్నారా… గతంలో ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వం వహించిన టువంటి బాహుబలి విడుదలైన 13 రోజున మూడు కోట్ల కంటే తక్కువ షేర్ వసూలు చేశాడు.
కానీ సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం ఈ రికార్డుని తిరగరాశాడు.అయితే అంతకంటే ముందు అత్యధికంగా బాహుబలి 2 మాత్రమే విడుదలైన 13 రోజున 4.9 కోట్ల షేర్ వసూలు చేసిన రికార్డుని తన పేరిట పదిలంగా ఉంచుకుంది.అయితే ఈ చిత్రం తర్వాత సాయి ధరమ్ తేజ్ అత్యధిక వసూళ్లు కలెక్ట్ చేసి రెండవ స్థానంలో నిలిచాడు.
అసలే హిట్లు లేక బాధపడుతున్న సాయి ధరమ్ తేజ్ కి గతంలో వచ్చిన చిత్రలహరి మరియు ప్రతి రోజు పండగే చిత్రాలు మంచి కం బ్యాక్ అని చెప్పుకోవచ్చు.దీంతో ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ తన సక్సెస్ ని ఎంజాయ్ చెసే పనిలో పడ్డాడట.
అయితే ఇది ఇలా ఉండగా సాయి తేజ్ తో పాటు ఆ రోజు విడుదలైన రూలర్, దబాంగ్ 3, దొంగ వంటి చిత్రాలు పెద్దగా ప్రెకషకులను ఆకట్టుకోకపోవడంతో అది కూడా సాయి తేజ్ కి ఒక ప్లస్ పాయింట్ గా నిలిచిందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నారు.ఏదేమైనప్పటికీ ప్రతి రోజు పండగే చిత్రం సాయి తేజ్ లైఫ్ లో ఒక మంచి హిట్ గా నిలిచిపోతుందని లో ఎటువంటి సందేహం లేదు.