గ్రామ వాలంటీర్ లను దున్నపోతులంటూ

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే సుమారు 4 లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా గ్రామ వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి వారి ద్వారా గ్రామాల్లోని సమస్యలను తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరికి చేరువ అయ్యే విధంగా జగన్ వ్యవస్థను రూపొందించారు.ఇప్పటికే వారు సమర్థవంతంగా తమ విధులను నిర్వహిస్తూ ప్రభుత్వానికి, ప్రజలకు చేదోడువాదోడుగా నిలుస్తున్నారు.

 Bjp Leader Baireddy Rajashekara Reddy Senstional Coments-TeluguStop.com

అయితే గ్రామ వాలంటీర్ల విషయంలో మొదటి నుంచి వైసిపి ప్రత్యర్థులు చిన్న చూపు చూస్తూ అవహేళన చేస్తూనే ఉన్నారు.

తాజాగా టిడిపి మాజీ నాయకుడు ప్రస్తుత బీజేపీ లీడర్ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి గ్రామ సచివాలయ ఉద్యోగులు వాలంటీర్ల పై అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్నారు.

సచివాలయాలు వార్డులు అంటూ ప్రతి గ్రామంలో 40 మంది దున్నపోతులను ప్రజలపైకి ముఖ్యమంత్రి జగన్ వదిలారని విమర్శించారు బైరెడ్డి.కర్నూలులో మీసేవ నిర్వాహకులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న బైరెడ్డి ఈ విమర్శలు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube