జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు ఏపీ టీడీపీ అధ్యక్షులు కళా వెంకట్రావ్ 19 ప్రశ్నలతో కూడిన బహిరంగ లేఖ రాశారు.రాష్ట్రానికి నమ్మకద్రోహం చేస్తుంటే మోడీ-షాను వదిలేసి టీడీపీపై విమర్శలు ఎలా చేస్తారని ఆని ఆయన ప్రశ్నించారు.
బీజేపీకి పవన్ ఎందుకు భుజం కాస్తున్నారని నిలదీశారు.బీజేపీ-పవన్ మధ్యనున్న చీకటి ఒప్పందం ఏమిటీ అని ప్రశ్నించారు.
రాష్ట్ర ప్రయోజనాల విషయంలో పవన్ కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు.వెనుకబడిన జిల్లాల నిధులను వెనక్కు తీసుకుంటే జనసేన నిలదీయదా అని అడిగారు.
రాఫెల్ డీల్ విషయంలో ఇప్పటి వరకు ఎందుకు సైలెంటుగా ఉన్నారన్నారు.వంతాడ అక్రమాల వెనుక వైసీపీ నేతలు బాలినేని, వైవీ సుబ్బారెడ్డిలు ఉన్నారని పవన్ కు తెలీదా అన్నారు.విశాఖలో వట్టి రవి నివాసంలో జగన్ పవన్ కలిశారనే ప్రచారం నిజం కాదా అని కళా వెంకట్రావ్ ప్రశ్నించారు.పవన్ ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారోననే క్లారిటీ ఇవ్వగలరా అన్నారు.