ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది.ఈ మేరకు అసెంబ్లీలో ప్రవేశపెట్టే 20 బిల్లులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ఇందులో భాగంగా ఇండస్ట్రీయల్ పాలసీకి కేబినెట్ ఆమోదం వెల్లడించింది.
ప్రభుత్వ స్కూళ్లల్లో నైట్ వాచ్ మెన్ల నియామకానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
గ్రామ/ వార్డు సచివాలయ వ్యవస్థకు న్యాయబద్ధత కల్పించేలా బిల్లుకు ఆమోద ముద్ర వేసింది.అమలాపురం అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ ఏర్పాటుతో పాటు 11 మండలాల్లోని 120 గ్రామాలు, 2 మున్సిపాలిటీలతో కొత్తగా ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుంది.