తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీ పెడుతుందనే ప్రచారం మొదలైనప్పటి నుండి రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి ఏ స్దాయిలో నెలకొన్నదో అందరికి తెలిసిందే.ఈ క్రమంలో విమర్శలు కూడా ఎదుర్కొన్న షర్మిల ఎలాంటి ఆరోపణలకు వెనకడుగు వేయకుండా ముందుకు వెళ్లుతున్నారు.
తెలంగాణలో పార్టీని బలోపేతం చేసే దిశగా పలు సమావేశాలు కూడా నిర్వహిస్తూ పార్టీ కార్యకర్తలను ఉత్తేజపరుస్తున్నారు.
ఇప్పటికే తెలంగాణలోని పలు జిల్లాలో పర్యటిస్తున్న షర్మిల తాజాగా తాను ఎక్కడి నుండి పోటీ చేస్తారో అనే విషయాన్ని అనౌన్స్ మెంట్ చేసారు.
తన రాజకీయ జీవితంలో ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా తన ప్రభంజనాన్ని మాత్రం ఎవరూ ఆపలేరని ఈ క్రమంలో వైఎస్ షర్మిల స్పష్టం చేశారు.
తన తండ్రి వైఎస్ కు పులివెందుల ఎలాగో తనకు పాలేరు అలాగని కాబట్టి ఇక్కడి నుండే పోటీ చేయడానికి సిద్దం అని పేర్కొన్నారు.
ఈ నేపధ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అభిమానులుగా, సానుభూతి పరులుగా ఉంటోన్న వారితో ఆత్మీయ సమావేశాలను నిర్వహిస్తోన్నారు.