వైసీపీ పార్టీలోవిషాదం చోటు చేసుకుంది.కుటుంబ సభ్యులతో కలిసి పారిశ్రామిక వాడలో నివాసం ఉంటున్న సూర్యాకుమారి అనే మహిళ ఇటీవల జరిగిన విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించారు.
విశాఖ 61వ వార్డు కార్పోరేటర్ గా ఉన్న సూర్యాకుమారి నిన్న రాత్రి అనుమానస్పదంగా మరణించారు.కాగా ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆమె ఇంటికి వెళ్లి పరిశీలించగా ఆమె శరీరం పై గాయాలు కనిపించాయట.
ఇంకా లోతుగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఆమెపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారనే ప్రాథమిక సమాచారం సేకరించారట.
ఈ మేరకు సూర్యాకుమారి మృత దేహాన్ని పోస్టు మార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించిన పోలీసులు ఈ కేసు మిస్టరీని చేధించడానికి అనే కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నామని వెల్లడించారు.
కాగ ఈ ఘటన తో పార్టీ శ్రేణుల్లో విషాదం నెలకొంది.