తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు సంచలన విషయాలతో హాట్ హాట్ గా మారుతున్న పరిస్థితి ఉంది.ఇప్పటికే టీఆర్ఎస్ తరువాత ప్రత్యామ్నాయ పార్టీగా ఎదగాలని బీజేపీ పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది.
తాజాగా బండి సంజయ్ చేపట్టిన జనజాగరణ దీక్షను పోలీసులు అడ్డుకోవడం, కోర్టులో హాజరుపరచడం కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడం తెలిసిందే.అయితే కేంద్ర ప్రభుత్వం విధించిన కరోనా ఆంక్షలను ఉల్లంఘిస్తూ వంద మందికి పైగా జన సమూహంతో కలిసి దీక్ష చేయడాన్ని పోలీసులు అడ్డుకోవడానికి ప్రయత్నించారు.
దీంతో పోలీసులను అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో కరోనా నిబంధనలను ఉల్లంఘించారని బండి సంజయ్ పై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు.పోలీసులు అందించిన ప్రాధమిక ఆధారాలను పరిశీలించి కోర్టుకు తెలపడంతో కోర్టు బండి సంజయ్ కు 14 రోజులు రిమాండ్ విధించింది.
అయితే బండి సంజయ్ కు రిమాండ్ విధించడంతో బీజేపీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగారు.అయితే ఇప్పుడు బండి సంజయ్ రిమాండ్ కు వెళ్లడంతో తెలంగాణ రాజకీయాలలో సరికొత్త చర్చ జరుగుతోంది.
జీవో 317లో సవరణ చేయాలనిజన జాగరణ దీక్షతోబీజేపీ రాజకీయంగా మరింతగా బలపడుతుందా అనే కోణంలో చర్చ జరుగుతోంది.
అయితే బండి సంజయ్ అరెస్ట్ కావడంతో బీజేపీ అంతగా బలపడే అవకాశం లేనటువంటి పరిస్థితి ఉంది.ఎందుకంటే ఉపాధ్యాయులు అందరూ జీవో 317 కు వ్యతిరేకంగా లేనప్పటికీ కొన్ని బీజేపీ ఉపాధ్యాయులు శాఖ వారు మాత్రమే కొద్దిగా బండి సంజయ్ దీక్షకు మద్దతు ఇచ్చిన పరిస్థితి ఉంది.అయితే బండి సంజయ్ అరెస్ట్ కు సంబంధించి టీఆర్ఎస్ నేతలు ప్రస్తుతానికి స్పందించకపోయినా రానున్న రోజుల్లో స్పందించే అవకాశం ఉంది.టీఆర్ఎస్ కు రాజకీయంగా నష్టం జరగకుండా కూడా క్షేత్ర స్థాయిలో ప్రక్రియ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.