ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ కు టీడీపీ నేత యనమల రామకృష్ణుడు లేఖ రాశారు.మండలి ప్రతిపక్ష నేతగా తాను అడిగిన వివరాలు ఇవ్వాలని పేర్కొన్నారు.
2021-22 కాగ్ నివేదిక ఏపీ ఆర్థిక దుస్థితికి అద్దం పడుతోందని యనమల తెలిపారు.సీఎం జగన్ మూడేళ్లలోనే రూ.3.25 లక్షల కోట్ల అప్పు చేశారని పేర్కోన్నారు.ఏపీలో 97 పబ్లిక్ సెక్టార్ సంస్థలు ఉంటే 30 సంస్థల ఆడిట్ లెక్కలే చూపాయని కాగ్ చెప్పిందన్నారు.ఈ ఏడాది రాష్ట్ర అప్పుల వాస్తవాలు తెలపాలని డిమాండ్ చేశారు.