విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి మరియు గీత గోవిందం సినిమాల తర్వాత చాలా సినిమాలను చేశాడు.కానీ ఇప్పటి వరకు ఏ ఒక్కటి కూడా మినిమం విజయాలను సొంతం చేసుకోలేక పోయాయి.
భారీ వసూళ్లు సొంతం చేసుకుంటుందని ఆశ పడ్డ లైగర్ సినిమా ఫలితం ఏమయ్యిందో అందరికి తెల్సిందే.లైగర్ సినిమా తర్వాత వరుసగా విజయ్ దేవరకొండ నుండి పాన్ ఇండియా సినిమాలు వస్తాయి అంటూ ఆ మధ్య బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరిగింది.
తీరా చూస్తే లైగర్ సినిమా బొక్క బోర్లా పడింది.దాంతో విజయ్ దేవరకొండ తో సినిమా లు చేయాలని భావించిన బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ వెనక్కు తగ్గారు అనే ప్రచారం జరుగుతోంది.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఖుషి సినిమా పై విజయ్ దేవరకొండ ఆశలు పెట్టుకుని వెయిట్ చేస్తున్నాడు.అదుగో ఇదుగో అంటూ ఖుషి సినిమా వాయిదా పడుతోంది.
సమంత అనారోగ్య పరిస్థితుల కారణంగా విజయ్ దేవరకొండ యొక్క ఖుషి సినిమా నిలిచి పోయింది.
మళ్లీ ఫిబ్రవరి లో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.
ఇక విజయ్ దేవరకొండ ఇటీవల ఒక సినిమాకు కమిట్ అయ్యాడని… ఆ సినిమాకు విజయ్ దేవరకొండ తీసుకున్న పారితోషికం మరీ తక్కువ అన్నట్లుగా టాక్ వినిపిస్తుంది.
అర్జున్ రెడ్డి మరియు గీత గోవిందం రేంజ్ లో మరో రెండు మూడు సక్సెస్ లు విజయ్ దేవరకొండ కు పడి ఉంటే ఇప్పటి వరకు పారితోషికం విషయంలో రౌడీ స్టార్ స్టార్ హీరోలకు పోటీ గా ఉండే వాడు.కానీ ఇప్పుడు ఇంకా చిన్న హీరోల రేంజ్ లోనే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు అంటూ కామెంట్స్ వస్తున్నాయి.రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ లైగర్ ఫ్లాప్ అవ్వడంతో రెమ్యూనరేషన్ విషయంలో చాలా నష్టపోవాల్సి వచ్చిందట.