కాల గర్బంలో మరో ఏడాది కలిసేందుకు సిద్దం అయ్యింది.2021 సంవత్సరం పూర్తి అవ్వబోతుంది.ఏడాదికి వేల కొద్ది సినిమా లు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పైకి వస్తాయి.కాని గత ఏడాది ఈ ఏడాది రెండు సంవత్సరాలు కూడా కరోనా వల్ల చాలా దారుణమైన పరిస్థితి ఇండస్ట్రీకి తప్పలేదు.
ఈ రెండేళ్లలో దేశ వ్యాప్తంగా థియేటర్లు పూర్తి స్థాయిలో రన్ అయ్యింది. నాలుగు అయిదు నెలలే.ఇటీవలే థియేటర్లు ఉత్తరాదిన పూర్తి స్థాయిలో రన్ అవుతున్నాయి అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా థర్డ్ వేవ్ వల్ల సినిమా మళ్లీ నష్టాల్లోకి వెళ్లేలా థియేటర్ల పై ఆంక్షలు మొదలు అయ్యాయి.ఈ ఏడాది లో విడుదల అయిన సినిమా లే చాలా తక్కువ.
అందులో బాలీవుడ్ సినిమా లు మరీ తక్కువ.ఇక ఈ ఏడాది టాలీవుడ్ కు చాలా మంచి జరిగిందని చెప్పాలి.
ఇతర భాషల్లో సినిమాలు విడుదల అవ్వడమే కష్టం అనుకుంటున్న సమయంలో టాలీవుడ్ లో ఏకంగా భారీ సినిమా లు విడుదల అయ్యి వందల కోట్ల వసూళ్లు నమోదు చేశాయి.తెలుగులో వచ్చిన క్రాక్.
ఉప్పెన, జాతి రత్నాలు, వకీల్ సాబ్, పుష్ప, అఖండ, శ్యామ్ సింగ రాయ్ ఇంకా కొన్ని సినిమా లు మంచి విజయాన్ని సొంతం చేసుకుని వసూళ్ల వర్షం కురిపించాయి.థియేటర్లు తెలుగు రాష్ట్రాల్లో బాగానే నడుస్తున్నాయి.
ఉత్తరాదితో పోల్చితే సౌత్ లో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల పరిస్థితులు బాగానే ఉన్నాయి.
ఏపీలో టికెట్ల రేట్ల విషయం కాస్త ఇబ్బందిగా ఉంది తప్ప అన్ని విషయాల్లో కూడా టాలీవుడ్ ఈ ఏడాది ఇండియాలోనే నెం.1 గా నిలిచింది అనడంలో సందేహం లేదు.వచ్చే ఏడాది లో కూడా టాలీవుడ్ నుండి ఆర్ ఆర్ ఆర్.
రాధే శ్యామ్.సలార్ ఇంకా భారీ సినిమా లు రాబోతున్నాయి.కనుక 2022 లో కూడా టాలీవుడ్ నెం.1 కావాలని ప్రతి ఒక్కరం కోరుకుందాం.