హైదరాబాద్ మెట్రో రైల్ కొత్త మార్గాలపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో సీఎం ఆదేశాల మేరకు అధికారులు పనుల్లో నిమగ్నం అయ్యారు.
ఇందులో భాగంగా ఇంజినీరింగ్ అధికారులతో మెటీరియల్ కమిటీ సమావేశం అయింది.రెండో దశతో పాటు మెట్రో రైల్ కొత్త రూట్లపై అధికారులతో మెట్రో రైల్ ఎండీ ఎన్సీఎస్ రెడ్డి భేటీ అయ్యారు.
ఈ సమావేశంలో భాగంగా వీలైనంత త్వరగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని నిర్ణయం తీసుకున్నారు.పాతబస్తీ నుంచి శంషాబాద్ విమానాశ్రయం మరియు ఎల్బీనగర్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు మెట్రో రైల్ మార్గాన్ని ఎలా తీసుకెళ్లాలి అనే అంశంపై అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయనున్నారని తెలుస్తోంది.