1.యూఎస్ లో మేయర్ గా భారత సంతతి అమెరికన్
ఓహియో రాష్ట్రంలోని సిన్సినాటి మేయర్ గా భారత సంతతికి చెందిన అప్టాబ్ కర్మ సింగ్ పురేవల్ ( 39 ) విజయం సాధించారు.
2.హైదరాబాద్ కు చేరుకున్న సౌదీ లో చిక్కుకున్న ఎన్నారై ఫ్యామిలీ
వీసా రెన్యువల్ లో చోటు చేసుకున్న టెక్నికల్ ప్రాబ్లెమ్ వల్ల సౌదీ లో చిక్కుకున్న తెలుగు ఎన్.ఆర్.ఐ కుటుంబం ఎట్టకేలకు హైదరాబాద్ కు చేరుకున్నారు.
3.క్వారంటైన్ నిబంధనలు సవరించిన హాంకాంగ్
హాంకాంగ్ కు వచ్చే ప్రయాణికులు ఇక పై 21 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాల్సిన అవసరం లేదని హాంకాంగ్ ప్రకటించింది.
4.యోమెన్ లో క్షిపణి దాడి .ఐదుగురు మృతి
యోమెన్ లో క్షిపణి దాడి జరిగింది.ఈ ఘటనలో ఐదుగురు మరణించగా, ముప్పై మంది గాయాలపాలయ్యారు.
5.అమెరికాలో ఈ ఏడాది తొలి మరణ శిక్ష
అమెరికాలో తొలి మరణ శిక్ష అమలయ్యింది.అమెరికాలోని ఓక్లా హోమా లో ఓ హత్య కేసులో డోనాల్డ్ గ్రాండ్ అనే వ్యక్తికి ఈ శిక్ష పడగా ఇప్పుడు అమలయ్యింది.
6.మాస్క్ ఆంక్షలు ఎత్తివేసిన ఇంగ్లాండ్
ఇంగ్లాండ్ లో కరోనా ఆంక్షలను ఎత్తివేశారు.ఇకపై మాస్క్ తప్పనిసరి కాదని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది.
7.అమెరికా అధ్యక్షుడిపై ఎలన్ మాస్క్ సంచలన విమర్శలు
అమెరికా అధ్యక్షుడు జో బైడన్ పై ఎలన్ మాస్క్ సంచలన విమర్శలు చేశారు.బైడన్ ప్రాణమున్న ఓ తోలుబొమ్మ అంటూ వ్యాఖ్యానించారు.
8.వెలుగులోకి నియోకొయ్ వైరస్
చైనాలోని వ్యూహన్ సైంటిస్ట్ లు మరో కొత్త వైరస్ ను కనుగొన్నారు.దక్షిణాఫ్రికా లో బయటపడిన ‘ నియోకొయ్ ‘ వైరస్ అత్యంత ప్రమాదకారి అని, ఈ వైరస్ సోకిన ప్రతి ముగ్గురిలో ఒకరికి మరణం తప్పదని హెచ్చరించింది.
9.ప్రపంచంలోనే అత్యంత వృద్ద గొరిల్లా మృతి
ప్రపంచంలోనే అత్యంత వృద్ద గొరిల్లా ఓజి (61) మృతి చెందినట్టు అట్లాంటా జూ అధికారులు తెలిపారు.
10.తల్లితండ్రుల చెంతకు అరుణాచల్ ప్రదేశ్ యువకుడు
చైనా సరిహద్దు వద్ద దారితప్పి చైనా లోకి ప్రవేశించిన యువకుడు ‘ మిరమ్ తరొన్ ‘ క్షేమంగా తల్లితండ్రుల వద్దకు చేరుకున్నాడు.
ఈ మేరకు చైనా ఆర్మీ అధికారులు ఆ యువకుడిని భారత్ కు అప్పగించారు.
.