తెలంగాణలో ప్రభుత్వ రంగ బ్యాంకులకు వరుస సెలవులు ఉన్నట్టు బ్యాంకు ఉన్నతాధికారులు తెలిపారు.ఇకపోతే ఆదివారాలు, పండుగ పర్వదినాలు కాకుండా ప్రతి నెలా రెండు, నాలుగో శనివారాలు బ్యాంకులకు సెలవులు ఉంటాయని వెల్లడించారు.
ఇక వరుసగా వస్తున్న సెలవులను చూస్తే.ఈనెల 27న నాలుగో శనివారం, 28 ఆదివారం, 29 హోలీ పర్వదినం ఈ 3 రోజులు బ్యాంకులు పనిచేయవని, అలాగే ఈనెల 30, 31 తేదీల్లో బ్యాంకులు పనిచేస్తాయని పేర్కొన్నారు.
ఇకపోతే ఏప్రిల్ ఒకటో తేదీ బ్యాంకులు పని చేసినప్పటికీ ఖాతాదారుల లావాదేవీలు కొనసాగవని, ఏప్రిల్ 2వ తేదీ గుడ్ ఫ్రైడే బ్యాంకులు పనిచేయవని, ఏప్రిల్ 3న ఒక్క రోజు బ్యాంకులు పనిచేస్తాయన్నారు.
ఇక 4వ తేదీ ఆదివారం, 5వ తేదీ బాబు జగజ్జీవన్రామ్ జయంతి సందర్భంగా సెలవులు వస్తున్నాయని వెల్లడించారు.6, 7, 8, 9 తేదీల్లో బ్యాంకులు పనిచేస్తాయి.10వ తేదీ రెండో శనివారం, 11వ తేదీ ఆదివారం ఈ రెండు రోజులు బ్యాంకులకు సెలవని అధికారులు వెల్లడించారు.ఈ విషయాన్ని ఖాతాదారులు గమనించి తమ అవసరాలకు ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని విజ్ఞప్తి చేశారు.