ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణ చెలరేగింది.విజయరాయి గ్రామంలో ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు పరస్పర దాడులకు పాల్పడ్డారు.
ఈ దాడుల్లో కొందరికి గాయాలైనట్లు తెలుస్తోంది.అనంతరం గ్రామంలో రోడ్డుపై టీడీపీ కార్యకర్తలు బైఠాయించి నిరసనకు దిగారు.
తమపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన కార్యక్రమం చేపట్టారు.దీంతో ట్రాఫిక్ జామ్ అవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.