బుల్లితెర స్టార్ యాంకర్ శ్రీముఖి తన యాంకరింగ్ తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది.అంతకుముందు ఈటీవీ పటాస్ షోలో యాంకరింగ్ చేసిన శ్రీ ముఖి ఆ తర్వాత బిగ్ బాస్ కి వెళ్లి అక్కడ రన్నరప్ గా నిలిచింది.
ఇక స్టార్ మా, జీ తెలుగు ఇలా అన్ని ఛానెల్స్ లో అలరిస్తున్న శ్రీముఖి ఫెస్టివల్ టైం లో స్పెషల్ షోస్ తో జోష్ తెస్తుంది.ఈ క్రమంలో జీ తెలుగులో మన ఊరి రంగస్థలం షో వినాయక చవితి స్పెషల్ గా నిలిచంది.
ఈ షోలో వినాయక పూజ.లడ్డూ పాట కూడా నిర్వహించారు.
ఈ షోలో జీ సరిగమప సింగర్స్ లాస్ట్ సీజన్ ఈ సీజన్ లో ఉన్న వారినంతా తెచ్చి సందడి చేశారు.అంతేకాదు వినాయక చవితి సందర్భంగా కాబట్టి లడ్డూ పాటని కూడా ఏర్పాటు చేశారు.
అయితే ఈ లడ్డూ పాట 10 వేలతో మొదలవగా ఇరవై వేలు, లక్ష రూప్యాలు ఇలా మొదలై భాను శ్రీ ఏకంగా 2 లక్షలు అనేసింది.అయితే శ్రీముఖి పేరు మీద 5 లక్షలు అని చెప్పి పాట పాడేశారు.
సో శ్రీముఖి ప్రమేయం లేకపోయినా సరే 5 లక్షలతో లడ్డూ పాట పాడేసింది శ్రీముఖి.దానికోసం నిజంగానే ఆమె 5 లక్షల చెక్ ఇచ్చినట్టు తెలుస్తుంది.