జుట్టు పల్చబడటం.హెయిర్ గ్రోత్ లేకపోవడం వల్ల వచ్చే సమస్యల్లో ఇది ఒకటి.
హెయిర్ గ్రోత్ లేకుంటే ఊడే జుట్టు ఊడిపోతుంది.కానీ, కొత్త జుట్టు రాదు.
ఫలితంగా ఒత్తుగా ఉండాల్సిన జుట్టు పల్చగా మారిపోతుంది.దాంతో జుట్టును మళ్లీ ఒత్తుగా మర్చుకోవడం కోసం నానా పాట్లు పడుతుంటారు.
ఈ లిస్ట్లో మీరు ఉన్నారా? అయితే అస్సలు చింతించకండి.ఎందుకుంటే, ఇప్పుడు చెప్పబోయే సింపుల్ అండ్ ఎఫెక్టివ్ రెమెడీని ట్రై చేస్తే జుట్టు ఎంత పల్చగా ఉన్నా ఒత్తుగా మరియు పొడవుగా మారడం ఖాయం.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో ఓ చూపు చూసేయండి.
ముందుగా ఒక చిన్న గిన్నెను తీసుకుని అందులో మూడు టేబుల్ స్పూన్ల బియ్యం వేసి వాటర్తో ఒకసారి కడిగాలి.
ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి మందపాటి గిన్నెను పెట్టుకుని ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోయాలి.వాటర్ హీట్ అవ్వగానే అందులో కడిగి పెట్టుకున్న బియ్యం, గుప్పెడు మందారం పువ్వు రేకలు వేసి పది నుండి పదిహేను నిమిషాల పాటు చిన్న మంటపై ఉడికించాలి.
అపై స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సాయంతో వాటర్ను మాత్రం ఫిల్టర్ చేసుకోవాలి.ఈ వాటర్ పూర్తిగా చల్లారక.అందులో వన్ టేబుల్ స్పూన్ ఆముదం, వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఇ ఆయిల్ వేసుకుని బాగా కలిపాలి.ఇప్పుడు ఈ వాటర్ను దూది సాయంతో జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు రాసి ముడి పెట్టుకోవాలి.
గంట అనంతరం మైల్డ్ షాంపూను యూస్ చేసి హెడ్ బాత్ చేయాలి.ఇలా వారంలో రెండు సార్లు గనుక చేస్తే జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది.ఎవరైతే పల్చటి జుట్టుతో బాధపడుతున్నారో వారు తప్పకుండా ఈ రెమెడీని ట్రై చేస్తే మంచి ఫలితం పొందుతారు.