తెలంగాణ ప్రజలకు ఏకైక నాయకురాలు సోనియాగాంధీ అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.పార్టీలోకి వచ్చిన శ్రీహరి రావుకు సముచిత స్థానం కల్పిస్తామని తెలిపారు.
కేసీఆర్ చేతిలో మోసపోయిన వారి జాబితాలో శ్రీహరి రావు ఒకరని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.నిర్మల్ అసెంబ్లీలో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
కొందరు పార్టీ వీడితే నాయకులే ఉండరన్నట్లు వ్యవహరించారన్న రేవంత్ రెడ్డి అంతకంటే బలమైన నేతలు పార్టీలోకి వచ్చారని తెలిపారు.తెలంగాణ సమాజం తిరగబడే సమయం ఆసన్నమైందని వెల్లడించారు.