సాధారణంగా చాలామంది తన జీవితంలో ఎన్నో తప్పులు చేస్తూ ఉంటారు.ఎంతో మంది జైలుకు వెళ్తుంటారు అలాగే సాధారణ జీవితం కూడా గడుపుతూ ఉంటారు.
ఇది చాలామంది జీవితాల్లో జరిగేది.ఒకసారి సినిమాల్లో ప్రవేశించారు అంటే వారి జీవితం అద్దాల మేడ లాంటిది.
అనే భావన అందరికీ ఉంటుంది.కానీ ఆ అద్దాల మేడ లో కూర్చొని కూడా తప్పులు చేసి జనాల్లో డీఫేం అయిన వారు కూడా ఉంటారు.
అలా సినిమా హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతున్న ఒక స్టార్ హీరోయిన్ దొంగతనం, అబద్ధాలు చెప్తూ తన తోటి నటి నటుల ముందు దోషిగా నిలబడ్డ సందర్భాలు ఉన్నాయి.
అలాంటి హీరోయిన్ ఎవరో కాదు అలనాటి స్టార్ సరోజినీ దేవి.
ఆమె షూటింగ్ లొకేషన్లో ఉన్న వస్తువులను దొంగతనం చేస్తుంది.ఫైవ్ స్టార్ హోటల్స్ లో దిగితే అక్కడ ఉన్న సామాను అంతా కూడా ఖాళీ చేస్తుంది.
సబ్బులు, టవల్స్, దుప్పట్ల నుంచి ప్రతి ఒక్కటి కాజేస్తుంది లొకేషన్ లో ఉంటేనే అయితే కెమెరాకి సంబంధించిన లైన్స్, కేబుల్స్, లైట్స్ ఇలా ప్రతి ఒక్కటి కూడా ఆమె బ్యాగ్ లో పెట్టుకుని వెళ్ళిపోతుంది ఇది ఆమెకున్న అలవాటు.ఇలా దొంగతనం చేసే అలవాటు ఉన్న సరోజినీ దేవికి అబద్ధాలు చెప్పే అలవాటు కూడా ఉంది.
ఈ విషయం సావిత్రి విషయంలో రుజువు అయ్యింది.సరోజినీ దేవి, సావిత్రి ఇద్దరూ మంచి స్నేహితులు.ఒకసారి ఇద్దరూ కలిసి మందు కొడుతు సావిత్రి మెడలో ఉన్న నెక్లెస్ బాగుంది అని ఒకసారి వేసి చూసుకుంటాను అని తీసుకొని వెళ్ళిపోయింది.ఆ తర్వాత ఆ విషయం సావిత్రి మర్చిపోయింది ఆ నక్లెస్ ఖరీదు అప్పట్లోనే లక్షల్లో ఉండేది.
ఆ ఒక్క నక్లెస్ ఉంటే చాలు ఎంతోమంది మూడు పూటలా కొన్నేళ్లపాటు హాయిగా బ్రతకొచ్చు.అంతటి ఖరీదైన నక్లెస్ ని సరోజినీ దేవి ఓసారి చూస్తానని తీసుకెళ్లి మళ్ళీ తిరిగి ఇవ్వలేదు.
సావిత్రి కష్టకాలంలో ఆ నక్లెస్ గురించి అడగ్గా నువ్వు అసలు నాకు ఆ నక్లెస్ ఇవ్వలేదు అని అబద్ధం చెప్పి బుకాయించింది.అలా అబద్దాలతో, దొంగతనాల తో సరోజినీ దేవి చాలా సార్లు దోషిగా నిలబడింది.