ప్రస్తుతం సోషల్ మీడియా( Social media ) పుణ్యమా అంటూ ప్రపంచం ఏ మూలన ఏమి జరిగినా.అందరికీ క్షణాలలో ప్రతి వార్త తెలిసిపోతుంది.
చిన్నపిల్లవాడి నుంచి పెద్దవారి వరకు కూడా ప్రతి ఒక్కరు సోషల్ మీడియా వినియోగం సర్వసాధారణం అయిపోయింది.సోషల్ మీడియా వినియోగం అనేది కొంతమందికి సరదాగా కాసేపు సమయం కేటాయిస్తూ ఉంటే.
మరికొందరు అయితే కేవలం సోషల్ మీడియాకే అంకితం అవుతూ ఉంటారు.ఇక నిత్యం మనం సోషల్ మీడియాలో కొన్ని రకాలకు జంతువులకు సంబంధించిన వీడియోలు చూస్తూనే ఉంటాం.
కొంతమంది జంతువులను ప్రేమగా వాటి ఆలనా పాలనా చూస్తూ ఉంటే.మరికొందరు దుర్మార్గులైతే జంతువుల పట్ల క్రూరంగా ప్రవర్తించడం లాంటివి మనం గమనిస్తూనే ఉంటాం.
అయితే తాజాగా ఒక వ్యక్తి ఒంటె కాలును నరికిన సంఘటన ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.ఇందుకు సంబంధించి పూర్తి వివరాలోకి వెళ్తే.పాకిస్తాన్( Pakistan ) లోని సింధు ప్రావిన్స్ లో ఈ దారుణమైన సంఘట చోటుచేసుకుంది.ఓ వ్యక్తి తన పొలంలో ప్రతిరోజు మేత తింటున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఒంటె కాలును నరికి వేశాడు.
ఇలాంటి దారుణానికి పాల్పడడం ఓ పనికమలినా పనైతే.అది చాలదు అన్నట్టు విరిగిన కాలును చేత్తో పట్టుకొని మరి ఫోటోలకు ఫోజులు ఇచ్చాడంట.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక కాలు లేక ఇబ్బందులు పడుతున్న ఆ ఒంటె ఫోటోను చూసి కొంతమంది నెటిజన్స్ చాలా బాధపడుతూ ఉంటే.
మరికొందరు దీనికి అసలు కారకుడైన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని కామెంట్ చేస్తున్నారు.మరి మీకేమి అనిపిస్తుందో ఓ కామెంట్ చేయండి.