టాలీవుడ్ హీరోయిన్ సాయి పల్లవి గురించి వ్యక్తిగతంగా పరిచయం అక్కర్లేదు.సాయి పల్లవి తెలుగుతో పాటు ఇండస్ట్రీలో ఏ రేంజ్ లో అభిమానులు ఉన్నారో మనందరికీ తెలిసిందే.
ఈమె అందానికి విపరీతంగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది.సాయి పల్లవి ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ లో ఒకరిగా రాణిస్తున్న విషయం తెలిసిందే.
సినిమాలోని పాత్రలు ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరింస్తోందీ.ఇది ఇలా ఉంటే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి పల్లవి ఆసక్తికర విషయాల గురించి వెల్లడించింది.
ఈ సమయంలోనే సదరు యాంకర్ అడిగే ప్రశ్నలకు నవ్వుతూ సమాధానాలు ఇచ్చింది.మీరు ఇంక లావు అవ్వరా అని యాంకర్ ప్రశ్నించగా.
నేను పూర్తి శాఖాహారిని.అన్నం, పప్పు ఇవి ఉంటే చాలు.
సెట్ లో కూడా కొబ్బరినీళ్లు, మజ్జిగ ఉంటే ఇంకేం అడగను.అలాగే మేకప్ అంటే అస్సలు ఇష్టం ఉండదు.
వర్క్ ఔట్ లీ కూడా పెద్దగా చేయను.అప్పుడప్పుడూ సరదాగా బ్యాడ్మింటన్ ఆడతాను.
నేను త్వరగా బరువు పెరగను కాబట్టి నాకు జిమ్లో కసరత్తులు చేసే అవసరం రాలేదు అని తెలిపిందీ సాయి పల్లవి.

అలాగే పలానా హీరోతో నటించాలి అన్న ఆలోచన ఏమైనా ఉందా అని అడగగా కథ బాగుంటే చేస్తాను అని తెలిపిందే.ఫలానా స్టార్ హీరో సినిమాలో మీరు హీరోయిన్ గా చేస్తారా అంటే స్టార్ హీరో ఎవరు అని కూడా అడగను ముందు కథ చెప్పండి అని అంటాను అని తెలిపింది సాయి పల్లవి.కానీ సిని ఇండస్ర్టీలో ఉన్న హీరోలందరిపైనా గౌరవం ఉంది.
అలాగే అల్లు అర్జున్తో ఒక్క సినిమా కూడా చేయలేదు.కానీ ఆయన డాన్స్ అంటే ఇష్టం అని చెప్పకొచ్చింది.
ఇక మహేశ్బాబు స్ర్కీన్ ప్రెజెన్స్ అంటే ఇష్టం అని మహేష్ ని చూసాక మగాళ్లు ఇంత అందంగా ఉంటారా అని ఆశ్చర్యపోతాను అని వెల్లడించింది సాయి పల్లవి.