ఇంకా అసలు బయోపిక్‌ ఏంటీ వర్మ.. బాలయ్య, క్రిష్‌ చేసేది ఏంటీ?

తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర చిత్రం ‘ఎన్టీఆర్‌’ జనవరిలో రెండు పార్ట్‌లుగా రాబోతున్న విషయం తెల్సిందే.మొదటి పార్ట్‌ను ‘ఎన్టీఆర్‌ కథానాయకుడు’గా రెండవ పార్ట్‌ను ‘ఎన్టీఆర్‌ మహానాయకుడు’గా విడుదల చేయబోతున్నారు.

 Rgv Wants To Do Real Biopic Of Ntr-TeluguStop.com

అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది.ఇప్పటికే విడుదలైన ఎన్టీఆర్‌ లుక్‌ అందరిని అలరిస్తుంది.

ఇక ఎన్టీఆర్‌ బయోపిక్‌ ఎప్పుడెప్పుడు చూద్దామా అన్నట్లుగా నందమూరి అభిమానులు ఉన్నారు.ఈ సమయంలోనే వర్మ సంచలన కామెంట్స్‌ చేశాడు.

బాలయ్య ఎన్టీఆర్‌ సినిమాను ప్రకటించిన సమయంలోనే వర్మ ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ అంటూ సినిమాను ప్రకటించాడు.ఆ సినిమా చిత్రీకరణ ఇంకా ప్రారంభం కాలేదు.వర్మ ఆ సినిమాను మర్చి పోయాడని అంతా భావిస్తున్న సమయంలో అనూహ్యంగా మళ్లీ వర్మ ఆ సినిమాను పట్టాలపైకి తీసుకు వచ్చాడు.తాజాగా తన సినిమా కోసం చంద్రబాబు నాయుడు పాత్రకు ఒక వ్యక్తిని కూడా ఎంపిక చేయడం జరిగింది.

హోటల్‌లో సర్వర్‌గా పని చేసే వ్యక్తి అచ్చం చంద్రబాబు నాయుడులా ఉండటం గమనించిన వర్మ ఆ వ్యక్తి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించి సఫలం అయ్యాడు.ఆ వ్యక్తి విషయాలు వర్మకు తెలిశాయి.

త్వరలోనే షూటింగ్‌ ప్రారంభిస్తాను అంటూ వర్మ ప్రకటించాడు.

ఇదే సమయంలో వర్మ ‘ఎన్టీఆర్‌’ చిత్రంపై కూడా స్పందించాడు.ఎన్టీఆర్‌ చిత్రంలో అసలు ఆయన గురించిన నిజాలు చెప్పడం లేదని, అసలు విషయాలను నేను చెప్తాను అంటూ వర్మ ప్రకటించాడు.ఎన్టీఆర్‌ చిత్రం నిజంగా ఎన్టీ రామారావు బయోపిక్‌ కాదని, తాను చేయబోతున్నది నిజమైన బయోపిక్‌ అంటూ ప్రకటించాడు.

వర్మ ప్రకటనతో క్రిష్‌ మరియు బాలకృష్ణలు కాస్త ఆగ్రహంతో ఉన్నట్లుగా సమాచారం అందుతుంది.వర్మ తీయబోతున్న లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ చిత్రం నిండుగా వివాదాలతో నిండి ఉంటుందనే టాక్‌ వినిపిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube