మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న విషయం తెల్సిందే.లీడ్ స్టార్స్ అంతా కూడా దాదాపుగా డబ్బింగ్ చెప్పేశారు.
ఇప్పుడు ఇతర నటీనటులు డబ్బింగ్ చెబుతున్నారు.దాదాపుగా సినిమా వర్క్ పూర్తి అయ్యిందని భావిస్తున్న తరుణంలో చిత్రాన్ని ఒక సారి రాజమౌళికి చూపించే ఉద్దేశ్యంలో చిత్ర యూనిట్ సభ్యులు ఉన్నట్లుగా సమాచారం అందుతోంది.
రాజమౌళి సలహాలు మరియు సూచనల మేరకు ఈ చిత్రంలో ఎడిటింగ్లు చేయాలని భావిస్తున్నారు.
ప్రస్తుతం బల్గేరియాలో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం షూటింగ్లో బిజీగా ఉన్న రాజమౌళి అతి త్వరలోనే హైదరాబాద్కు రానున్నాడు.ఆ సమయంలోనే సైరా చిత్రాన్ని చూపించాలని నిర్మాత చరణ్ మరియు చిరంజీవిలు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.గతంలో స్క్రిప్ట్ విషయంలో కూడా రాజమౌళి వద్ద దర్శకుడు సురేందర్ రెడ్డి సలహాలు తీసుకున్నట్లుగా వార్తలు వచ్చాయి.
తాజాగా ఇప్పుడు సినిమా ఫైనల్ వర్షన్ను రాజమౌళికి చూపించడం ద్వారా ఆయన అభిప్రాయంను మరోసారి తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.
సినిమాను మొదట అక్టోబర్ 2న విడుదల చేయాలని భావించారు.అయితే ఆ రోజు బాలీవుడ్ మూవీ వార్ విడుదల అవ్వబోతున్న నేపథ్యంలో అలాగే దసరాకు చిత్రం విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో ఈ చిత్రంను వాయిదా వేశారు.అక్టోబర్ రెండవ వారంలో చిత్రంను విడుదల చేయబోతున్నారు.భారీ ఎత్తున అంచనాలున్న ‘సైరా’ చిత్రంకు జక్కన్న కత్తెరింపులు ఏ మేరకు పని చేస్తాయో అంటూ మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇటీవలే విడుదలైన సాహో చిత్రంకు కూడా జక్కన్న సలహాలు ఇచ్చాడని వార్తలు వచ్చాయి.కాని ఆ సినిమా ఫలితం ఏంటో తెల్సిందే.