స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సక్సెస్ ఫుల్ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్ గా టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా తెరకెక్కుతున్న విషయం అందరికి తెలిసిందే.ఈ సినిమా మొదటి పార్ట్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్టు చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా విడుదల చేస్తున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
ఇటీవలే మారేడు మిల్లి అటవీ ప్రాంతంలో చిత్రీకరణ జరిపారు.అక్కడ షూటింగ్ పూర్తి చేసుకుని చిత్ర యూనిట్ హైదరాబాద్ లో అడుగు పెట్టింది.అడుగు పెట్టగానే వెంటనే ఆలస్యం చెయ్యకుండా హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేసింది.
సారధి స్టూడియోలో పుష్ప సినిమా కోసం ప్రత్యేకమైన సెట్టింగ్ వేశారు.ప్రెసెంట్ ఆ సెట్టింగ్ లోనే సినిమా చిత్రీకరణ జరుపుకుంటుంది.
సుకుమార్ పుష్ప సినిమా కోసం ఇప్పటి వరకు యాక్షన్ సన్నివేశాలు, ఛేజింగ్ సీన్స్ మాత్రమే షూట్ చేసాడు.కానీ ఇప్పుడు ఇంటీరియర్ షాట్స్ ను ఈ ప్రత్యేకమైన సెట్టింగ్ లో తీస్తున్నాడని సమాచారం.
ఈ షెడ్యూల్ నవంబర్ మొదటి వారం పూర్తి అవుతుందట.ఆ తర్వాత చివరి షెడ్యూల్ ను అక్టోబర్ లో పూర్తి చేసేందుకు పక్కా ప్లాన్ చేసుకుంటున్నట్టు సమాచారం.
ఇక ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన పోస్టర్స్, ఫస్ట్ సింగిల్, టీజర్ ఎంత రికార్డ్ క్రియేట్ చేశాయో చెప్పనవసరం లేదు.ఇక ఈ సినిమాలో బన్నీ తనలోని మాస్ యాంగిల్ ను పూర్తిగా చూపించేందుకు రెడీ అవుతున్నాడు.ఈ సినిమాలో మలయాళ యాక్టర్ ఫహద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్నాడు.
ఇక ఈ సినిమాకు రాక్ స్టార్ దేసి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.