ప్రముఖ టాలీవుడ్ కమెడియన్లలో ఒకరైన పృథ్వీ గతంలో చెలరేగిన ఒక వివాదం వల్ల రాజకీయాలకు దూరంగా ఉన్నారు.ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ కావాలని పృథ్వీ ప్రయత్నిస్తున్నా ఆయనకు ఎక్కువమంది అవకాశాలు ఇవ్వడం లేదని తెలుస్తోంది.
తాజాగా పృథ్వీ పవన్ కళ్యాణ్ గురించి కామెంట్లు చేయగా ఆ కామెంట్లు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను తాను ద్వేషించలేదని పృథ్వీ అన్నారు.
యామిని సాధినేని గతంలో పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ కామెంట్లు చేశారని ఆ సమయంలో యామిని సాధినేని చేసిన కామెంట్లను తాను సపోర్ట్ చేశానని పృథ్వీ చెప్పుకొచ్చారు.చిరంజీవి గురించి తాను ఎప్పుడూ నెగిటివ్ కామెంట్లు చేయలేదని పృథ్వీ వెల్లడించారు.
పొలిటికల్ గా తనకు సమస్యలు వచ్చిన సమయంలో సినిమా రంగం నుంచి సపోర్ట్ లభించిందని పృథ్వీ కామెంట్లు చేశారు.తాను ఎవరి అండతో మాట్లాడానో నేను కష్టాల్లో ఉన్న సమయంలో వాళ్లు సపోర్ట్ ఇవ్వలేదని పృథ్వీ తెలిపారు.
తనకు సినిమాల్లో అవకాశాలు రాకుండా సమస్యలు సృష్టించాలని భావిస్తే సృష్టించేవారని అయితే తనకు ఎవరూ అలా సమస్యలు సృష్టించలేదని పృథ్వీ కామెంట్లు చేశారు.
పార్టీ నుంచి పవన్ ను తిట్టాలని ఆదేశాలు వచ్చి ఉండవచ్చని పృథ్వీ వెల్లడించారు.అయితే తిట్టే సమయంలో కడుపుకు అన్నం తినేవాళ్లు అలాంటి మాటలు మాట్లాడవచ్చా? మాట్లాడకూడదా? అనే విషయాలను కూడా గుర్తుంచుకోవాలని పృథ్వీ తెలిపారు.
అయితే నెటిజన్లు మాత్రం సినిమాలలో అవకాశాల కోసమే పృథ్వీ ఈ తరహా కామెంట్లు చేస్తున్నారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.గతంలో విమర్శలు చేసిన పృథ్వీ మెగా హీరోల దృష్టిలో పడాలని ఈ విధంగా వ్యవహరిస్తున్నారని మరి కొందరు చెబుతున్నారు.నెగిటివ్ కామెంట్ల గురించి పృథ్వీ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాల్సి ఉంది.