యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల సంఖ్య చాలా పెద్దగా ఉంది.ఆదిపురుష్ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి అయ్యి విడుదలకు సిద్ధం అవుతోంది.
పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మరియు గ్రాఫిక్స్ వర్క్ ను జరుపుకుంటున్న ఆదిపురుష్ కొత్త విడుదల తేదీ త్వరలో ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి.మరో వైపు ప్రభాస్ మరియు మారుతి కాంబో సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయ్యింది.
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో ప్రభాస్ మరియు మారుతి కాంబో మూవీ షూటింగ్ ఇప్పటి వరకు రెండు షెడ్యూల్స్ ను ముగించుకుంది.కానీ సినిమాకు సంబంధించిన చిన్న లీక్ కూడా ఇవ్వలేదు.
అసలు ఈ కాంబో ను పీపుల్స్ మీడియా వారు నిర్మిస్తున్నట్లుగా కూడా ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాలేదు.ఎందుకు ఇంత గోప్యత అనేది తెలియడం లేదు.
మారుతి దర్శకత్వంలో ప్రభాస్ సినిమా ఎలా ఉంటుందో అనే ఆందోళన అభిమానుల్లో ఉంది.
థ్రిల్లర్ కామెడీ కథాంశంతో ఈ సినిమాను మారుతి రూపొందిస్తున్నాడు అంటూ ఆ మధ్య ప్రచారం జరిగింది.ప్రభాస్ తో థ్రిల్లర్ సినిమా ఏంటో అంటూ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.కానీ ఇప్పటి వరకు అఫిషియల్ గా మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు.
ఒక వైపు ప్రాజెక్ట్ కే వంటి పాన్ వరల్డ్ మూవీ చేస్తూ ఇలా మారుతి దర్శకత్వంలో సినిమా ను చేయాల్సిన అవసరం ఏంటో అంటూ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. ఆదిపురుష్ మరియు సలార్ సినిమాలతో పాటు ప్రాజెక్ట్ కే సినిమాలు కూడా పాన్ వరల్డ్ మూవీస్ గా రూపొందుతున్నాయి.
మరి మారుతి సినిమా కనీసం పాన్ ఇండియా మూవీగా అయినా ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా మారుతి దర్శకత్వంలో సినిమా ఉంటుందా.పాన్ ఇండియా రేంజ్ లో ప్రభాస్ ఫ్యాన్స్ ను అలరించగలదా అనేది చూడాలి అంటే మరి కొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.వచ్చే ఏడాదిలో మారుతి ప్రభాస్ కాంబో మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తుందనే వార్తలు వస్తున్నాయి.