బాహుబలి సాహో తర్వాత ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా రాధాకృష్ణ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం రాధేశ్యామ్.ఈ సినిమా ఈ నెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు.ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రభాస్ ఈ చిత్రం గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
ఈ సినిమా ప్రేమ కథ చిత్రంతో రూపొందటం వల్ల ఈ సినిమాలో ఎక్కువగా రొమాంటిక్ సన్నివేశాలు ఉంటాయి అనే విషయం సగటు ప్రేక్షకుడికి కూడా తెలిసిందే.
ఈ క్రమంలోనే ఈ సినిమాలో ప్రభాస్ పూజా హెగ్డే మధ్య ఎన్నో రొమాంటిక్ సన్నివేశాలు ఉన్నాయి.
ఈ సన్నివేశాల గురించి ప్రభాస్ ఓపెన్ అయ్యారు.ఈ సినిమా ప్రేమ కథ చిత్రంతో తెరకెక్కడం వల్ల ఇందులో తప్పకుండా రొమాంటిక్ సన్నివేశాల్లో నటించాల్సి వచ్చింది.
అయితే ఇలాంటి సన్నివేశాల్లో నటించేటప్పుడు కాస్త ఇబ్బంది పడ్డానని ప్రభాస్ తెలియజేశారు.ఈ సినిమాకు ముద్దు సీన్లు రొమాంటిక్ సన్నివేశాలు అవసరం కాబట్టి చేయక తప్పలేదు అంటూ ప్రభాస్ చెప్పుకొచ్చారు.
![Telugu Bahubali, Pooja Hegde, Prabhas, Radhakrishna, Radhe Shyam, Saho, Tollywoo Telugu Bahubali, Pooja Hegde, Prabhas, Radhakrishna, Radhe Shyam, Saho, Tollywoo](https://telugustop.com/wp-content/uploads/2022/03/Pooja-Hegde-Movie-promotion-Bahubali.jpg )
ఇక ఈ రొమాంటిక్ సన్నివేశాలలో నటించడానికి ప్రభాస్ కాస్త మొహమాట పడినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఇలాంటి రొమాంటిక్ సన్నివేశాలలో షూటింగ్ చేసే సమయంలో వీలైనంత వరకు సెట్ లో ఎవరూ లేకుండా ఉండేలా చూసుకోవాలని ముందుగా డైరెక్టర్ కి చెప్పినట్లు ప్రభాస్ వెల్లడించారు.హీరోయిన్ ను ముద్దు పెట్టుకోవడానికి అలాగే చొక్కా విప్పడానికి కూడా తాను ఎంతో ఇబ్బంది పడ్డానని ఈ సందర్భంగా తెలియజేశారు.