బిగ్ బాస్ హౌస్ లోకి విడాకులు తీసుకున్న జంట.. ఈసారి మామూలుగా ఉండదుగా?

తెలుగు ప్రేక్షకులకు బిగ్ బాస్ రియాల్టీ షో గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.బిగ్ బాస్ షో తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా ప్రసారమవుతున్నప్పటికీ తెలుగులో విశేష ప్రేక్షకు ఆదరణను దక్కించుకుంది.

 Noyel And Ester In Bigg Boss Telugu Season 7, Noyel, Ester, Bigg Boss Season 7,-TeluguStop.com

ఇప్పటికే తెలుగులో బిగ్ బాస్ షో 6 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే ఇటీవలే బిగ్ బాస్ సీజన్ 6 ముగిసిన విషయం కూడా తెలిసిందే.

బిగ్ బాస్ సీజన్ 6 అయితే చాలా బోర్ కొట్టింది అని చెప్పవచ్చు.అంతేకాకుండా టిఆర్పి రేటింగ్స్ అమాంతం పడిపోయాయి.

దీంతో హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాగార్జునకు కూడా ఇంట్రెస్ట్ పోయినట్టు తెలుస్తోంది.

Telugu Balayya Babu, Ester, Esther, Noel, Noyel, Ramyakrishna, Rana, Tollywood-M

దాంతో నెక్స్ట్ సీజన్ కి హోస్ట్ గా ఉండను అని చెప్పేసాడు నాగార్జున.ఇకపోతే బిగ్ బాస్ సీజన్ సెవెన్ త్వరలోనే మొదలుకానుండగా ఆ షోకీ హోస్ట్ గా రానా, బాలయ్య బాబు, రమ్యకృష్ణ, విజయ్ దేవరకొండ లాంటి పేర్లు ఇప్పటికే సోషల్ మీడియాలో జోరుగా వినిపించిన సంగతి మనందరికీ తెలిసిందే.వీటితోపాటుగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లబోయే కంటెస్టెంట్ ల పేర్లు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

బిగ్బాస్ సీజన్ 6 బోరింగ్ గా అనిపించడంతోపాటుగా టిఆర్పి రేటింగ్స్ కూడా పడిపోవడంతో సీజన్ సెవెన్ ని హిట్ చేయాలి అన్నా పట్టుదలతో ఉన్నారు బిగ్ బాస్ నిర్వాహకులు.ఈ క్రమంలోనే హౌస్ లోకి మంచి మంచి కంటెస్టెంట్లను పంపించబోతున్నట్టు తెలుస్తోంది.

Telugu Balayya Babu, Ester, Esther, Noel, Noyel, Ramyakrishna, Rana, Tollywood-M

ఇది ఇలా ఉంటే తాజాగా బిగ్ బాస్ సీజన్ 7 కు సంబంధించి ఒక ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అదేమిటంటే బిగ్ బాస్ హౌస్ లోకి విడాకులు తీసుకున్న ఒక సెలబ్రిటీ జంటను పంపించబోతున్నట్లు తెలుస్తోంది.ఆ జంట మరెవరో కాదు టాలీవుడ్ స్టార్ సింగర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నోయల్.అతని భార్య ఎస్తేర్.ఈ సెలబ్రిటీ జనతా పెళ్లి చేసుకున్న తర్వాత కొన్నాళ్లకే మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకొని విడిపోయిన విషయం తెలిసిందే.అంతేకాకుండా ఒకరిపై ఒకరు ఆరోపణలు కూడా చేసుకున్నారు.

అయితే వీరిద్దరిని బిగ్ బాస్ హౌస్ లోకి పంపించాలి అని ఆలోచిస్తున్నారట బిగ్బాస్ షో నిర్వాహకులు.మరి ఈ విషయంపై నిజానిజాలు తెలియాలి అంటే షో నిర్వాహకులు అధికారికంగా ప్రకటించేంత వరకు వేచి చూడాల్సిందే మరి.అయితే ఎలా అయినా ఈసారి బిగ్ బాస్ సీజన్ సెవెన్ ని హిట్ చేయాలి టిఆర్పి రేట్లు పెంచుకోవాలి అన్న ఆలోచనతో షో నిర్వాహకులు ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.కాగా ఇప్పటికే యాంకర్ రష్మిని కూడా సంప్రదించినట్లు వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube