బుల్లితెర సీరియల్ కార్తీకదీపం ద్వారా నిరుపమ్ కు ప్రేక్షకుల్లో క్రేజ్ రోజురోజుకు పెరుగుతోంది.ఆసక్తికర ట్విస్టులతో కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉండటం గమనార్హం.
డాక్టర్ బాబు భార్య మంజుల కూడా సీరియల్స్ లో నటించడంతో పాటు తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.తాజాగా ఒక ఈవెంట్ లో మంజుల, నిరుపమ్ పాల్గొనగా మంజుల కాలేజ్ రోజుల్లో చేసిన పనుల గురించి చెప్పుకొచ్చారు.
చంద్రముఖి సీరియల్ షూటింగ్ సమయంలో మంజుల,నిరుపమ్ ప్రేమలో పడ్డారు.కొన్నేళ్లు ప్రేమించుకున్న తర్వాత పెద్దలను ఒప్పించి మంజుల నిరుపమ్ పెళ్లి చేసుకున్నారు.ఈ జోడీకి ఇద్దరు పిల్లలు ఉన్నారు.బుల్లితెర శోభన్ బాబుగా పేరు తెచ్చుకున్న కార్తీక్ కు మేల్ ఫ్యాన్ ఫాలోయింగ్ తో పోలిస్తే ఫిమేల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది.
జీ తెలుగు ఛానల్ లో అల బృందావనములో పేరుతో ఒక ఈవెంట్ ప్రసారమవుతోంది.
కృష్ణాష్టమి పండుగ కానుకగా ఈ ఈవెంట్ ప్రసారం కావడం గమనార్హం.రియాజ్ శ్రీముఖిని ఇమిటేట్ చేయగా నాకు చచ్చిపోవాలని ఉందని శ్రీముఖి చెబుతారు.కాలేజ్ లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్ సిగరెట్ ట్రై చేయాలని చెప్పిందని నాకైతే సిగరెట్ తాగే ఉద్దేశం లేదని ఆమె అన్నారు.
నిరుపమ్ ఉద్దేశాలు ఎందుకులే తరువాత ఏం జరిగిందో చెప్పు అని మంజులను అడుగుతాడు.
ప్రస్తుతం ప్రోమో తెగ వైరల్ అవుతుండగా ఆగష్టు నెల 29వ తేదీన సాయంత్రం 5 గంటలకు ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది.ఈ షోకు సుశాంత్, శ్రీవిష్ణు గెస్ట్ లుగా హాజరై తనదైన శైలిలో పంచ్ లు వేసి మెప్పించడం గమనార్హం.ప్రోమోలో శ్రీముఖిపై దారుణంగా పంచ్ లు వేయడంతో శ్రీముఖి అభిమానులు మాత్రం ప్రోమోను చూసి ఫీలవుతుండటం గమనార్హం.