సూపర్ స్టార్ కృష్ణ భార్య మహేష్ బాబు తల్లి శ్రీమతి ఇందిరా దేవి గారు మరణించిన విషయం తెలిసిందే.దీంతో ఘట్టమనేని ఇంట్లో మరోసారి విషాదం చోటు చేసుకుంది.
మహేష్ బాబుకు తల్లితో చాలా అటాచ్ మెంట్ ఉంది.మరి అలాంటి తల్లి ఇక లేరు అని తెలిసి ఈయన చాలా క్రుంగి పోయారు.
ఇక కృష్ణ కూడా భార్యను కోల్పొవడంతో విషాదంగా ఉన్నారు.ఈమె కొన్ని అనారోగ్య కారణాలతో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.
మహేష్ బాబు తన ఇంటి పెద్ద దిక్కును కోల్పోవడంతో హఠాత్పరిణామాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు.ఈ వార్త విని టాలీవుడ్ ప్రముఖులు మహేష్ బాబుతో పాటు సూపర్ స్టార్ కృష్ణను పరామర్శించి వారికీ ధైర్యం చెప్పారు.
అయితే ఆమె మరణించిన సమయంలో కొంత మంది విదేశాల్లో షూటింగులతో ఉండడం వల్ల రాలేక పోయారు.మరి రాలేక పోయిన వారిలో నందమూరి బాలకృష్ణ కూడా ఉన్నారు.
ఈయన తన 107వ సినిమా షూటింగ్ కోసం టర్కీ వెళ్లారు.
అందుకే మహేష్ బాబును తాజాగా పలకరించారు.
నిన్న ఇందిరా దేవి గారి 11వ రోజు కార్యక్రమాన్ని నిర్వహించగా ఈ కార్యక్రమానికి బాలయ్య హాజరయ్యి మహేష్ తో పాటు కృష్ణ గారిని పలకరించి సంతాపాన్ని తెలిపారు.మహేష్ కుటుంబం అత్యంత సన్నిహితులను నిన్న పిలిచినట్టుగా తెలుస్తుంది.
మరి బాలయ్య కూడా శనివారం తన భార్యతో కలిసి మహేష్ కుటుంబాన్ని కలిసి సంతాపం తెలియజేసారు.మరి దీనికి సంబందించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇక మహేష్ సినిమాల విషయానికి వస్తే.మహేష్ బాబు చాలా రోజుల తర్వాత ఈ మధ్యనే షూట్ లో పాల్గొన్నాడు.సర్కారు వారి పాట సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకుని ఈ మధ్యనే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా స్టార్ట్ చేసాడు.కానీ ఈ లోపే మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి గారు మరణించారు.
దీంతో షూటింగ్ ఆగిపోయింది.ఇక రెండు మూడు రోజుల్లో ఈ షూట్ స్టార్ట్ కాబోతున్నట్టు తెలుస్తుంది.