పురంధేశ్వరిపై మంత్రి అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు..!!

ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిపై వైసీపీ మంత్రి అమర్నాథ్( Minister Amarnath ) సంచలన వ్యాఖ్యలు చేశారు.తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవడానికి పురందేశ్వరి తాపత్రయ పడుతున్నట్లు ఆరోపించారు.

 Minister Amarnath's Sensational Comments On Purandeshwari Bjp, Minister Amarnath-TeluguStop.com

చంద్రబాబు( N.Chandrababu Naidu ) స్క్రిప్ట్ మాదిరిగా పురంధేశ్వరి మాటలు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.శుక్రవారం మీడియా సమావేశంలో మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని పురంధేశ్వరి దుష్ప్రచారం చేస్తున్నట్లు విమర్శించారు.విశాఖ రైల్వే జోన్ పై కేంద్రంతో ప్రకటన చేయించాలని మంత్రి అమర్నాథ్ సవాలు విసిరారు.

టీడీపీ హయాంలో విశాఖలో జరిగిన భూదందాపై ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు.బీజేపీలో ఉంటూ తెలుగుదేశం పార్టీకి అనాధికారికంగా పురంధేశ్వరి పని చేస్తున్నట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు.ఎవరు ఎన్ని కుట్రలు చేసినా మళ్ళీ జగన్( CM jagan ) ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని మంత్రి అమర్నాథ్ పేర్కొన్నారు.అంతకుముందు పురంధేశ్వరి విశాఖలో మీడియా సమావేశంలో ఏపీ ప్రభుత్వ పాలన పై మండిపడ్డారు.

కేంద్రం నిధులు ఇస్తుంటుంటే జోబులను నింపుకుంటున్నట్లు విమర్శించారు.కేంద్రం నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తుందని సంచలన ఆరోపణలు చేశారు.

రాష్ట్రంలో రోడ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.దీంతో పురంధేశ్వరి( Daggubati Purandeswari ) చేసిన వ్యాఖ్యలకు మంత్రి అమర్నాథ్ రాజాగా కౌంటర్ ఇవ్వడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube