నారా లోకేష్ సమక్షంలో చేరిన వైసీపీ నాయకులు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు నెలల్లో ఎన్నికలు( AP Elections ) జరగనున్నాయి.ఎన్నికలలో ఎలాగైనా గెలవాలని ప్రధాన పార్టీలు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాయి.

 Mangalagiri Ycp Leaders Joined In The Presence Of Nara Lokesh Details, Tdp, Ysr-TeluguStop.com

ఇప్పటికే అధికార పార్టీ వైసీపీ. సీట్టింగ్ ఎమ్మెల్యేల విషయంలో వ్యతిరేకత కలిగిన వారిని పక్కన పెట్టేస్తూ ఉంది.

ఈ క్రమంలో ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనటానికి ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టడం జరిగింది.పార్టీ బలహీన పడిందనుకున్న నియోజకవర్గాలకు సంబంధించి కొత్త ఇన్చార్జిలను నియమిస్తూ ఉంది.

ఈ క్రమంలో వైసీపీ పార్టీలో( YCP ) అసంతృప్తి నేతలు పార్టీకి రాజీనామాలు చేస్తున్నారు.

తాజాగా ఈ రకంగానే వైసీపీ పార్టీకి రాజీనామా చేసిన మంగళగిరి నియోజకవర్గానికి చెందిన కీలక నాయకులు.నారా లోకేష్( Nara Lokesh ) సమక్షంలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ కావడం జరిగింది.ఉండవల్లి నివాసంలో శనివారం నారా లోకేష్ సమక్షంలో వైసీపీ నేతలు అయిన గుంటూరు జిల్లా ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షుడు సంక బాలాజీ గుప్తా, మంగళగిరి మాజీ కౌన్సిలర్ రమాదేవి, రాము.

మంగళగిరి వస్త్ర ఉత్పత్తి విక్రయదారుల సంఘం అధ్యక్షులు పెండింగ్ శివరామకృష్ణ వంటి నేతలు టీడీపీలో జాయిన్ అయ్యారు.ఈ సందర్భంగా లోకేష్ వీరికి తెలుగుదేశం పార్టీ( TDP ) కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube