ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు నెలల్లో ఎన్నికలు( AP Elections ) జరగనున్నాయి.ఎన్నికలలో ఎలాగైనా గెలవాలని ప్రధాన పార్టీలు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఇప్పటికే అధికార పార్టీ వైసీపీ. సీట్టింగ్ ఎమ్మెల్యేల విషయంలో వ్యతిరేకత కలిగిన వారిని పక్కన పెట్టేస్తూ ఉంది.
ఈ క్రమంలో ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనటానికి ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టడం జరిగింది.పార్టీ బలహీన పడిందనుకున్న నియోజకవర్గాలకు సంబంధించి కొత్త ఇన్చార్జిలను నియమిస్తూ ఉంది.
ఈ క్రమంలో వైసీపీ పార్టీలో( YCP ) అసంతృప్తి నేతలు పార్టీకి రాజీనామాలు చేస్తున్నారు.
తాజాగా ఈ రకంగానే వైసీపీ పార్టీకి రాజీనామా చేసిన మంగళగిరి నియోజకవర్గానికి చెందిన కీలక నాయకులు.నారా లోకేష్( Nara Lokesh ) సమక్షంలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ కావడం జరిగింది.ఉండవల్లి నివాసంలో శనివారం నారా లోకేష్ సమక్షంలో వైసీపీ నేతలు అయిన గుంటూరు జిల్లా ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షుడు సంక బాలాజీ గుప్తా, మంగళగిరి మాజీ కౌన్సిలర్ రమాదేవి, రాము.
మంగళగిరి వస్త్ర ఉత్పత్తి విక్రయదారుల సంఘం అధ్యక్షులు పెండింగ్ శివరామకృష్ణ వంటి నేతలు టీడీపీలో జాయిన్ అయ్యారు.ఈ సందర్భంగా లోకేష్ వీరికి తెలుగుదేశం పార్టీ( TDP ) కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.