సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం సర్కారీ వారి పాట.ఈ సినిమా మే 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ క్రమంలోనే పెద్దఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఇక నేడు సాయంత్రం ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్, టీజర్, పాటలు సినిమా పై భారీ అంచనాలు పెంచాయి.మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత వస్తున్న చిత్రం కావడంతో అభిమానులు కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.
ఈ క్రమంలోనే మహేష్ బాబు తన అభిమానులను ఉద్దేశిస్తూ బహిరంగంగా ఒక లేఖ రాశారు.ప్రస్తుతం ఈ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇంతకీ ఆ లెటర్ లో ఏముందనే విషయానికి వస్తే.సర్కారీ వారి పాట చిత్రం షూటింగ్ పనులన్నింటినీ పూర్తిచేసుకుని మే 12వ తేదీ భారీ ఎత్తున విడుదలకు సిద్ధంగా ఉంది.
ఎన్నో అంచనాలతో, ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్న మన సర్కారు వారి పాట చిత్రాన్ని థియేటర్లోనే చూసి మీ స్పందన తెలియ చేయండి అంటూ మహేష్ బాబు బహిరంగంగా అభిమానులకు లేఖ రాశారు.
అదే విధంగా ఈ సినిమా తర్వాత మహేష్ బాబు నటించబోయే సినిమా గురించి కూడా అప్ డేట్ ఇచ్చారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు చేస్తున్న సినిమా జూన్ నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుందని మహేష్ బాబు ఈ సందర్భంగా తన తదుపరి సినిమా గురించి కూడా వెల్లడించారు.మహేష్ బాబు అభిమానుల కోసం రాసిన ఈ లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.