మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన బీజేపీ మరియు శివసేన పార్టీలు ప్రభుత్వ ఏర్పాటు విషయానికి వచ్చేప్పటికి విభేదించుకుంటున్నారు.50 సీట్లు వచ్చిన శివసేన పార్టీ కూడా తమకు ముఖ్యమంత్రి పదవి కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు.సగం రోజుల పాటు సీఎం పీఠంను పంచి ఇవ్వాల్సిందే అంటూ శివసేన డిమాండ్ చేయడంతో బీజేపీ ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తుంది.ఈ సమయంలోనే ఊసులోనే లేవు అనుకున్న కాంగ్రెస్ మరియు ఎన్సీపీలు తమ ప్రయత్నాలు చేస్తున్నాయి.
శివసేన మద్దతుతో కాంగ్రెస్ మరియు ఎన్సీపీలు ప్రభుత్వంను ఏర్పాటు చేయాలని భావిస్తున్నాయి.అందుకు సంబంధించిన చర్చలు కూడా జరుగుతున్నాయి.
ఇప్పటికే శివసేన నేతలతో మాట్లాడిన ఎన్సీపీ అధినేత శరత్ పవార్ త్వరలోనే కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీని కూడా కలిసి మహారాష్ట్ర విషయమై చర్చలు జరుపబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.అందుకు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి.
బీజేపీ పట్టు వీడకుంటే ఎన్సీపీ మరియు కాంగ్రెస్లతో కలిసి ప్రభుత్వంను ఏర్పాటు చేయాలని శివసేన భావిస్తుంది.