తెలంగాణ స్థానిక ప్రజా ప్రతినిధులకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి లేఖ రాశారు.పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో స్థానిక ప్రజా ప్రతినిధుల పరిస్థితిని లేఖలో వివరించారు.
ఈ నేపథ్యంలో ఈ సారి ఎన్నికల్లో ప్రజా ప్రతినిధుల పాత్ర అత్యంత కీలకమని రేవంత్ రెడ్డి తెలిపారు.పార్టీలు, జెండాలు, ఎజెండాలు పక్కన పెట్టండన్న ఆయన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి ఇదొక అవకాశం అని స్పష్టం చేశారు.
మీ కష్టాలు తీర్చి, మీ గౌరవాన్ని పెంచే బాధ్యత కాంగ్రెస్ దని భరోసా ఇచ్చారు.తాము అధికారంలోకి వచ్చిన తరువాత స్థానిక సంస్థలకు పూర్వ వైభవం తీసుకొస్తామని తెలిపారు.
ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పాలనకు చరమగీతం పాడుదామని వెల్లడించారు.