తెలుగులో తక్కువ సినిమాల్లోనే నటించినా ఇప్పటికీ స్పెషల్ సాంగ్స్ చేస్తూ వరుస అవకాశాలతో బిజీగా ఉన్నారు రాయ్ లక్ష్మీ.తెలుగుతో పోలిస్తే ఇతర ఇండస్ట్రీల్లో రాయ్ లక్ష్మీకి అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయి.2005 సంవత్సరంలో నటిగా కెరీర్ ను ప్రారంభించిన రాయ్ లక్ష్మీ కెరీర్ లో పెద్దగా బ్లాక్ బస్టర్ హిట్లు లేకపోయినా అందం, అభినయం పుష్కలంగా ఉన్న నటి కావడంతో ఆమెకు వరుసగా అవకాశాలు వస్తున్నాయి.
సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే రాయ్ లక్ష్మీ గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ ఫాలోవర్లను అంతకంతకూ పెంచుకుంటున్నారు.
గతేడాది కరోనా బారిన పడి కోలుకున్న రాయ్ లక్ష్మీ కరోనా అనుభవాల గురించి మాట్లాడుతూ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.తాను కరోనా వైరస్ నుంచి ఎన్నో విషయాలను నేర్చుకున్నానని.
కరోనా వల్ల మానవాతా దృక్పథంతో నడుచుకోవాలని.ఇతరులకు సహాయం చేయాలనే ఆలోచన వచ్చిందని తెలిపారు.
సినిమా రంగంలో మాత్రమే కాకుండా ఇతర రంగాల్లో కూడా ఇతరులకు సహాయం చేయాలనే ఆలోచన వచ్చిందని వెల్లడించారు.మరిచిపోయిన చాలా విషయాలను కరోనా గుర్తుకు తెచ్చిందని ఆమె అన్నారు.
కరోనా నుంచి కోలువడాన్ని తాను పునర్జన్మలా భావిస్తున్నానని రాయ్ లక్ష్మీ పేర్కొన్నారు.కరోనా సోకినా ఇంకా ప్రాణాలతో జీవించి ఉన్నామనే విషయం తలచుకుంటే ఎంతో సంతోషంగా ఉందని రాయ్ లక్ష్మీ తెలిపారు.
2021 న్యూ ఇయర్ వేడుక సందర్భంగా దుబాయ్ కు వెళ్లిన రాయ్ లక్ష్మికి అక్కడికి వెళ్లిన తర్వాత కరోనా నిర్ధారణ అయింది.కరోనా నిర్ధారణ అయిన 12 రోజుల తర్వాత ఆమె వైరస్ నుంచి కోలుకున్నారు.
గతేడాది నోటి క్యాన్సర్ వల్ల రాయ్ లక్ష్మీ తండ్రి మరణించగా తండ్రి మరణం నుంచి కోలుకోక ముందే ఆమె కరోనా బారిన పడ్డారు.