కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ తెలంగాణ ప్రజల కల నెరవేర్చారని తెలిపారు.
బీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చలేదని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేర్కొన్నారు.ప్రాజెక్టుల రీడిజైనింగ్ తో రూ.లక్షల కోట్లు అప్పుల భారం మోపారని ఆరోపించారు.కాళేశ్వరంలో లోపాలు ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత తమపై ఉందని తెలిపారు.
అలాగే తుమ్మడిహెట్టీ నిర్మాణం చేపట్టాల్సిన అవసరముందన్న జీవన్ రెడ్డి రాజకీయాలకు అతీతంగా ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని వెల్లడించారు.