రాజమండ్రిలో విషాదం నెలకొంది.లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు తాళలేక దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
దీంతో ఇద్దరు చిన్నారులు అనాథలుగా మిగిలారు.ఆనందనగర్ పేపర్ మిల్లు వద్ద నివాసం ఉంటున్న దుర్గారావు, లక్ష్మీ భార్యాభర్తలు ఆన్లైన్ యాప్లో కొంత మొత్తం లోన్ తీసుకున్నారు.
అనుకున్న సమయానికి కట్టలేకపోవడంతో.దుర్గారావు భార్య ఫొటోలు మార్ఫింగ్ చేసి ఆన్లైన్లో పెడుతామని యాప్ నిర్వాహకులు బెదిరింపులకు దిగారు.
దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన దంపతులు ఓ లాడ్జిలో బలవన్మరణం చెందారు.
మరోవైపు, దంపతుల ఆత్మహత్య ఘటనపై సీఎం జగన్ విచారం వ్యక్తం చేశారు.
అనాథలుగా మారిన ఇద్దరు చిన్నారులకు ప్రభుత్వం తరపున ఆర్థికసాయం ప్రకటించారు.చిన్నారులకు రూ.5 లక్షల చొప్పున ఆర్థికసాయం అందించాలని జిల్లా కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు.అదేవిధంగా పిల్లల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని తెలిపారు.