తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రైతులు ప్రశ్నించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు.రాష్ట్రంలో రైతులు బలవన్మరణాలకు పాల్పడవద్దని సూచించారు.
రైతులకు ఏ కష్టం వచ్చినా బీజేపీకి చెప్పాలని కిషన్ రెడ్డి తెలిపారు.
ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బంది పెడితే రైతులు వెంటనే 99041 19119 నంబర్ కు ఫిర్యాదు చేయాలని సూచించారు.
కాగా హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో కిషన్ రెడ్డి రైతు దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే.ప్రశ్నిస్తున్న తెలంగాణ రైతాంగం పేరిట దీక్ష నిర్వహించిన కిషన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు.