మాజీ మంత్రి, మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.రాజీనామా చేస్తున్నట్లు ప్రకటిస్తూ పొన్నాల భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు.
కాంగ్రెస్ పార్టీ కోసం తాను కమిట్ మెంట్ తో పని చేశానని పొన్నాల లక్ష్మయ్య తెలిపారు.పేద కుటుంబం నుంచి ఈ స్థాయికి వచ్చినట్లు పేర్కొన్నారు.
వివిధ శాఖలకు కొత్త రూపాన్ని తెచ్చిన వ్యక్తినన్న పొన్నాల పార్టీలో ఎన్నో అవమానాలు, అవహేళనకు గురి చేశారని వాపోయారు.తనది 45 ఏళ్ల రాజకీయ జీవితమన్న పొన్నాల తనకు జరిగిన అవమానాలతో పార్టీని వీడుతున్నానని ప్రకటించారు.
ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ తీరుతో విసుగుచెందానని చెప్పారు.ప్రజల మద్దతు కూడగట్టే ఆలోచనలను చెప్పేందుకు తాను ప్రయత్నిస్తే ఎవరూ పట్టించుకోలేదన్నారు.
కాంగ్రెస్ లో కొద్ది మందికే ప్రాధాన్యత ఇచ్చారన్న పొన్నాల లక్ష్మయ్య తాను పదవుల కోసం రాజీనామా చేయలేదని తెలిపారు.