ప్రస్తుతం కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా రోజురోజుకీ తన కోరలు చాస్తోంది.ఈ కరోనా వైరస్ కారణంగా ఇప్పటి వరకూ దాదాపుగా ప్రపంచ వ్యాప్తంగా 1,26,000 పైచిలుకు మంది మరణించగా 4 లక్షల 84 వేల పైచిలుకు మంది కరోనా వైరస్ బారి నుంచి కోలుకున్నారు.
అయితే ఈ కరోనా వైరస్ ప్రపంచంలోనే అగ్రరాజ్యం అయినటువంటి అమెరికాలో బాగానే తన ప్రతాపం చూపిస్తోంది.
ఇప్పటివరకు అమెరికాలో మొత్తం 6 లక్షల 14 వేల పై చిలుకు మంది ఈ కరోనా వైరస్ బారిన పడ్డారు.
అయితే ఇందులో దాదాపుగా 26,000 పైచిలుకు మంది ఇప్పటికే ఈ ప్రాణాంతక కరోనా మహమ్మారి బారిన పడి మరణించారు.ప్రస్తుతం అమెరికాలోని ప్రజలు ప్రాణాలని గుప్పిట్లో పెట్టుకొని భయభ్రాంతులకు గడుపుతున్నారు.
మరోపక్క దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కరోనా వైరస్ గురించి భయపడవద్దని చెబుతున్నప్పటికీ కరోనా వైరస్ మరణాలు ఆగకపోవడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.అంతేగాక ఇప్పటివరకు న్యూయార్క్ నగరంలోనే దాదాపుగా 10,000 పైచిలుకు మంది కరోనా వైరస్ బారినపడి మరణించారు.
దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు కరోనా వైరస్ అమెరికాలో ఎంతగా కలకలం సృష్టిస్తుందో అని.
ప్రస్తుతం భారతదేశంలో కూడా కరోనా వైరస్ మెల్లగా తన ప్రతాపం చూపిస్తోంది.ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 11 వేల పైచిలుకు కరోనా కేసులు నమోదు కాగా ఇందులో 1300 మంది ఈ వైరస్ నుంచి కోలుకోగా 370 పైచిలుకు మంది మృత్యువాత పడ్డారు.దీంతో దేశ ప్రధాని నరేంద్ర మోడీ రోజురోజుకి కరోనా వైరస్ కట్టడిపై చర్యలను కఠినంగా అమలు చేస్తున్నారు.
అయితే ఇందులో భాగంగానే ఇటీవలె ఈ నెల 14తో ముగియాల్సిన లాక్ డౌన్ ని కూడా మే మూడో తారీఖు వరకు కొనసాగించాలని నిర్ణయం తీసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.