కడప లో జరిగిన ఘటన పై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం జగన్..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత జిల్లా కడప జిల్లాలో మామిళ్ళపల్లె శివారులో ముగ్గు రాయి క్వారీలో భారీ పేలుడు సంభవించింది.దాదాపు ఈ ఘటనలో పది మంది మృతి చెందినట్లు సమాచారం.

 Cm Jagan Expressed Shock Over The Incident In Kadapa Ys Jagan, Kadapa, Chandraba-TeluguStop.com

ముగ్గురాయి తొలగించడానికి వాహనంలో జిలెటిన్ స్టిక్స్ తీసుకువస్తుండగా ఒక్కసారి అదుపు తప్పటంతో స్టిక్స్ పేలి వాహనం తునాతునకలు అయ్యింది.దాదాపు 10 మంది చనిపోవడంతో ఉన్నతాధికారులు చేరుకోవడంతో వెంటనే విషయం తెలుసుకొని సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

మరి కొంతమంది ఆసుపత్రిలో జాయిన్ అవటంతో వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం.ఈ ఘటనపై ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు కూడా స్పందించారు.

పేలుడు ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించి మరోసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.జిలెటిన్ స్టిక్స్ పేలుడు ధాటికి చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube