టీడీపీ అధినేత చంద్రబాబు మరి కాసేపటిలో హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి వెళ్లనున్నారు.ఈ మేరకు ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకోనున్నారు.
ఇప్పటికే ఏఐజీ ఆస్పత్రికి చంద్రబాబు సతీమణి భువనేశ్వరితో పాటు నారా లోకేశ్ కూడా చేరుకున్నారని తెలుస్తోంది.కాగా నిన్న జూబ్లీహిల్స్ నివాసానికి వచ్చిన చంద్రబాబు ఆరోగ్య సమస్యలను వైద్యులు అడిగి తెలుసుకున్నారు.
ఈ క్రమంలోనే ఏఐజీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు ముగిసిన అనంతరం చంద్రబాబు ఎల్వీ ప్రసాద్ హాస్పిటల్ లో కంటి పరీక్షలు చేయించుకునే అవకాశం ఉంది.