బీఎఫ్.7 కోవిడ్ వేరియంట్ పై కేంద్రం అప్రమత్తం అయింది.ఈ మేరకు మధ్యాహ్నం ప్రధాని మోదీ అధ్యక్షతన అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు.దేశంలో కోవిడ్ పరిస్థితిపై మోదీ సమీక్షించనున్నారు.రాష్ట్రాలను అప్రమత్తం చేయడం, కేంద్రం తీసుకుంటున్న చర్యలను ప్రధాని మోదీకి కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి వివరించనున్నారు.
మరోవైపు భారత్ లో కోవిడ్ అదుపులోనే ఉందని వైద్యాధికారులు చెబుతున్నారు.
గడిచిన 24 గంటల్లో దేశంలో 185 కరోనా కొత్త కేసులు నమోదు అయ్యాయి.దేశవ్యాప్తంగా ప్రస్తుతం 3,402 కరోనా యాక్టివ్ కేసులున్నాయని తెలిపారు.అదేవిధంగా దేశంలో నాలుగు బీఎఫ్.7 వేరియంట్ కేసులు నమోదయ్యాయన్న వైద్యాధికారులు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.