ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కు పేదలకు ఇల్లు ఇవ్వడం ఇష్టం లేదని అందుకే కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చారని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు.హైకోర్టు ఆర్ 5 జోన్ లో ఇళ్ల నిర్మాణం పై స్టే ఇవ్వడం పై సుప్రీం కోర్టు కు వెళ్తామని మంత్రి బొత్స స్పష్టం చేశారు.
శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన నియోజకవర్గ సమీక్ష లో ఆయన పాల్గొన్నారు.
ప్రభుత్వం పేదలకు ఇల్లు ఇవ్వడానికి కట్టుబడి ఉందని ఆదిశగా చిత్త శుద్ది తో ప్రతి ఒక్క పేదవాని సొంత ఇంటి కల నెరవేరేలా ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు.
పవన్ కళ్యాణ్ కు అభివృద్ధి కి అర్ధం తెలియదని,రాష్ట్రంలో జిడిపి తలసరి ఆదాయం పెరిగిందంటే అది అభివృద్ధి కదా అని ఆయన ప్రశ్నించారు.