చంద్రబాబుకి( Chandrababu Naidu ) ఐటీ నోటీసులు పంపించడంతో వైసీపీ నాయకులు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.ఐటీ నోటీసులపై( IT Notices ) చంద్రబాబు స్పందించాలని ప్రశ్నిస్తున్నారు.
ఇదే సమయంలో చంద్రబాబు జైలుకెళ్లటం గ్యారెంటీ అని కొంతమంది నేతలు కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు.చంద్రబాబును రక్షించడానికి కేంద్ర ప్రభుత్వం మరియు బిజెపి నాయకులు ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా ఆరోపించడం జరిగింది.
ఈ నేపథ్యంలో చంద్రబాబు కూడా తాజాగా ఇదే రీతిలో వ్యాఖ్యలు చేయటం జరిగింది.రేపో మాపో.
నన్ను అరెస్టు( Arrest ) చేసిన చేస్తారు.నాపై దాడులు కూడా చేస్తారు.
వ్యవస్థలను అడ్డుపెట్టుకుని వైసీపీ( YCP ) అరాచకాలు సృష్టిస్తోంది.
గతంలో వైయస్సార్ నాపై 26 ఎంక్వయిరీలు వేసిన ఏం చేయలేకపోయారు.అనీ చంద్రబాబు స్పందించారు.ఇదిలా ఉంటే చంద్రబాబు మరియు వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపై బీజేపీ నాయకుడు సత్యకుమార్( BJP Satyakumar ) స్పందించడం జరిగింది.కేంద్రంపై వైసీపీ నేతలు కావాలనే బురద జల్లుతున్నారని పేర్కొన్నారు.ఎవరైనా తప్పులు చేస్తే దర్యాప్తు సంస్థలు చూసుకుంటాయని వ్యాఖ్యానించారు.ఇదే సమయంలో చంద్రబాబుని అరెస్టు చేయాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు.ఏపీలో అపరాజస్వామిక పాలన సాగుతుందని ప్రశ్నిస్తున్న వారిని ఇబ్బందులు పెడుతున్నారని విమర్శించారు.
ఈ క్రమంలో ప్రజలలో చైతన్యం రావాలని కోరుకుంటున్నట్లు సత్యకుమార్ వ్యాఖ్యానించారు.