భారీ స్కోర్ల నమోదు కోసం బీసీసీఐ కొత్త ఎత్తుగడ.. ఫ్యాన్స్‌లో ఆగ్రహం

క్రికెట్‌కు మన దేశంలో అధిక ఆదరణ ఉంది.ముఖ్యంగా హై స్కోరింగ్ మ్యాచ్‌లు అంటే చాలా మంది ఇష్టపడతారు.

 Bcci's New Move For Registering Huge Scores.. Fans Are Angry Bcci , Sports News,-TeluguStop.com

బ్యాటర్లు సిక్స్‌లు, ఫోర్లు కొడుతుంటే మైదానం ప్రేక్షకుల కేరింతలతో హోరెత్తుతుంటుంది.అలాంటి మ్యాచ్‌లకు టీవీలలో కూడా బాగా టీఆర్పీ వస్తుంది.

తాజాగా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌ను బీసీసీఐ ప్రారంభించింది.మ్యాచ్‌లను ఆసక్తిదాయకంగా మార్చేందుకు బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది.

దీనిపై ఓ వైపు విమర్శలు వస్తుండగా, మరో వైపు కొందరు ప్రశంసిస్తున్నారు.దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

మార్చి 4న నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమైంది.మొదటి రెండు రోజుల్లో, ముంబైలోని బుబోన్, డీవై పాటిల్ స్టేడియంలో ఫోర్లు, సిక్సర్లు భారీగా నమోదయ్యాయి.ఐపీఎల్ మాదిరిగా, మైదానంలో మ్యాచ్‌లను ఆస్వాదించడానికి వచ్చే ప్రేక్షకులు వినోదం పొందుతున్నారు.అయితే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌ను మరింత ఆసక్తిదాయకంగా మార్చేందుకు బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది.

బౌండరీ పరిధి ముందుకు జరిపింది.ఉండాల్సిన పరిధి కంటే 5 మీటర్లను ముందుకు జరిపింది.

ఫలితంగా ఫోర్లు, సిక్సర్లు ఎక్కువగా నమోదవుతాయని బీసీసీఐ ఆలోచన. టోర్నమెంట్ మొదటి రెండు రోజుల్లో బిసిసిఐ తన ప్రణాళికలను నెరవేర్చడంలో విజయవంతమైంది.బౌండరీని కేవలం 60 మీటర్ల పొడవును ఉంచాలని నిర్ణయించారు.మహిళల ప్రపంచ కప్‌లో బౌండరీ పరిధి 65 మీటర్లు పెట్టారు.అయితే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో దానిని కుదించారు.దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు.

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ విజయవంతం కోసం బీసీసీఐ ఇలాంటి పనులు చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు.అయితే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ విజయవంతమైతే అది మంచిదే కదా అని కొందరు పేర్కొంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube