రెండో దశ వారాహి విజయ యాత్రలో పవన్ కళ్యాణ్.( Pawan Kalyan ) వైసీపీ ప్రభుత్వంపై.
వాలంటీర్ల వ్యవస్థ పై చేస్తున్న వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.ఈ క్రమంలో వాలంటీర్ల విషయంలో పవన్ చేసిన వ్యాఖ్యలను ఏపీ హోంమంత్రి తానేటి వనిత( Home Minister Taneti Vanitha ) ఖండించారు.
పవన్ కళ్యాణ్ ఇష్టానుసారంగా మాట్లాడితే సరికాదని అన్నారు.హ్యూమన్ ట్రాకింగ్ పై కేంద్ర నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారం పవన్ దగ్గర ఉంటే బయటపెట్టాలని నిలదీశారు.
అలాగే ఆధారాలు ఉంటే ఫిర్యాదు చేయొచ్చని చెప్పుకొచ్చారు.గౌరవప్రదంగా పనిచేస్తున్న వాలంటీర్లను తప్పక అభినందించాలని కోరారు.
మరోసారి వాలంటీర్ల వ్యవస్థ పై( Volunteers ) అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు.ఇదిలా ఉంటే రెండో దశ వారాహి విజయ యాత్రలో తాడేపల్లిగూడెంలో నేడు జరిగిన బహిరంగ సభలో మరోసారి వాలంటీర్ల వ్యవస్థపై పవన్ విరుచుకుపడ్డారు.వాలంటీర్ల దగ్గర సమాచారం తీసుకుని సీఎం జగన్ హైదరాబాద్ లో నానక్ రామ్ గూడలో డేటా సెంటర్ కి అందిస్తున్నారని ఆరోపించారు.ఆ డేటా సెంటర్ లో దాదాపు 700 మంది పనిచేస్తున్నారని… వారందరికీ జీతాలు ఎవరు ఇస్తున్నారు అంటూ దీనిపై విచారణ జరగాలని.
పవన్ సంచలన ఆరోపణలు చేశారు.