కొన్ని మీడియా చానెల్స్ జర్నలిజం( Journalism ) విలువలను పూర్తిగా తుంగలోకి తొక్కి, నీచంగా వ్యవహరిస్తున్న తీరు సమాజానికి ఎంత చేటు చేస్తుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.ఈ మీడియా చానెల్స్ అంతర్గతంగా చేసే దరిద్రపు పనులు ఎన్నో సార్లు సోషల్ మీడియా లో లీక్ అయ్యాయి, అవి ఆ మీడియా చానెల్స్ పై తీవ్రమైన వ్యతిరేకతని ఏర్పర్చాయి.
అయినా కానీ వీళ్ళలో ఎలాంటి మార్పులు రాలేదు.టీఆర్ఫీ రేటింగ్స్ కోసం ఎంత పెద్ద గొడవలు అయినా పెట్టగలరు, ఎలాంటి విద్వంసాలను అయినా సృష్టించగలరు.2019 ఎన్నికల ముందు కత్తి మహేష్ ( Kathi Mahesh )మరియు శ్రీ రెడ్డి లాంటి వాళ్ళని పెట్టుకొని మీడియా చానెల్స్ పవన్ కళ్యాణ్ మీద ఏ స్థాయి బురద చల్లిందో మనమంతా చూసాము.సుమారుగా ఏడాది పాటు పవన్ కళ్యాణ్ ని ఆయన అభిమానులను మానిసకంగా టార్చర్ పెట్టారు.
టీవీ చానెల్స్ పెట్టాలంటే విసుగెత్తిపోయేలా చేసారు.ఇప్పుడు మళ్ళీ అదే గేమ్ ఆడబోతున్నారా అంటే అవుననే అనిపిస్తుంది లేటెస్ట్ గా సోషల్ మీడియా లో వచ్చిన వీడియో చూస్తుంటే.
ఈ క్రింది వీడియో లో కనిపిస్తున్న వ్యక్తి ఎవరో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.ఇప్పటి వరకు ఇతను తన ఛానల్ ద్వారా జనాలకు ఉపయోగపడే ఒక్క డిబేట్ కూడా పెట్టలేదు.ఎంతసేపు టీఆర్ఫీ రేటింగ్స్ మీదనే యావ.షర్మిల వార్తలు అయితే ఎవరూ చూడరు, పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) మరియు జగన్ మీద వచ్చే వార్తలు అయితే చాలా స్పైసీ గా ఉంటాయి.వాళ్ళ మీద డిబేట్ ప్లాన్ చెయ్యండి.ఓటు బ్యాంకింగ్, కులాల ఓట్లు , కాపు ఓట్ల మీద చర్చలు జరపండి మన ఛానల్ కి టీఆర్ఫీ రేటింగ్స్ పెరుగుతాయి అని తన టీం వారికి వివరిస్తున్నాడు.
దానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియా లో లీక్ అయ్యి ఇప్పుడు తెగ వైరల్ గా మారింది.పవర్ లో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ కి గులాం గిరి చేసి ఫండ్స్ దక్కించుకోవడం ఈ ఛానల్ కి మొదటి నుండి అలవాటే.
ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో వైసీపీ పార్టీ( YCP party ) కోసం ఈ ఛానల్ పనిచేస్తుంది.జగన్ ( jagan )గారి సొంత మీడియా ఛానల్ సాక్షి కంటే కూడా, ఈ ఛానల్ చేసే డ్యూటీ ఎక్కువ.అసలే ఈ ఛానల్ పై సోషల్ మీడియా లో నెగటివిటీ ఎవరూ ఊహించని స్థాయి లో ఉంటుంది.సినిమాల్లో కూడా ఈ ఛానల్ పై ఇప్పటి వరకు ఎన్నో రకాల సెటైర్లు పడ్డాయి.
ఇక ఇలాంటి వీడియోస్ లీక్ అయితే నెగటివిటీ ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.కనీసం ఈ నెగటివిటీ ని చూసి అయినా ఈ ఛానల్ లో మార్పు వస్తుందో లేదో చూడాలి.