యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీకి సంబంధించిన టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ జూలై 10న వస్తుండటంతో ప్రేక్షకులు ఈ పోస్టర్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరికొత్త వింటేజ్ లుక్లో కనిపిస్తాడని చిత్ర యూనిట్ మొందు నుండి చెబుతూ వస్తోంది.
కాగా ఈ సినిమాలో భారీ క్యాస్టింగ్ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.ఇక ఈ సినిమాలో నటిస్తున్న వారిలో సశా ఛత్రి కూడా ఓ కీలక పాత్రలో నటిస్తోంది.
సశా ఛత్రి పేరు ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు.కానీ ఎయిర్టెల్ యాడ్తో ప్రేక్షకులను ఆకట్టుకున్న పిల్లగా అందరికీ ఈమె సుపరిచితురాలు.ఎయిర్టెల్ యాడ్తో మంచి క్రేజ్ను దక్కించుకుని బాలీవుడ్లో సినిమా ఛాన్సులు కొట్టేసిన ఈ బ్యూటీ, ఇప్పుడు ప్రభాస్ 20వ చిత్రంలోనూ ఓ కీలక పాత్రలో నటిస్తోంది.ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోన్న పూజా హెగ్డే చెల్లి పాత్రలో సశా ఛత్రి నటిస్తుందట.
ఇక పూజాతో కలిసి ఆమె చేసే అల్లరి ఓ రేంజ్లో ఉండనున్నట్లు తెలుస్తోంది.ప్రభాస్ అల్ట్రా స్టైలిష్ లుక్తో కనిపించే ఈ సినిమాను పీరియాడికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా దర్శకుడు రాధాకృష్ణ డైరెక్ట్ చేస్తున్నాడు.
యువీ క్రియేషన్స్, గోపీకృష్ణ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు ఈ సినిమాను సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి.మరి ఈ సినిమాకు ఎలాంటి టైటిల్ను పెడతారో తెలియాలంటే మరికొద్ద గంటలు ఆగాల్సిందే.